దొంతిరి కార్తీక్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం.|

0
225

 

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ రామ్ లీలా మైదానంలో దొంతిరి కార్తీక్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్బంగా మెగా రక్త దాన శిబిరం కారుణ్య హాస్పిటల్ సహకారం తో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి, యువ కాంగ్రెస్ నాయకులు బొంగునూరి కిషోర్ రెడ్డి, హై కోర్ట్ అడ్వకేట్ ప్రకాష్ రెడ్డి, పండరి యాదగిరి మరియు కార్తీక్ రెడ్డి, మిత్రులు, మరియూ అభిమానులు పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తండ్రి దొంతిరి నర్సింహారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రిలాగే సేవకార్యక్రమాలు చేస్తూ కార్తీక్ రెడ్డి చిన్న వయస్సులోనే అకాల మరణం మమ్మల్ని చాలా బాధించింది, అయినా కూడా వారి కుటుంబ సభ్యులు మరియు మిత్రులు ఇలాగే సేవ కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.

కార్తీక్ రెడ్డి మిత్రులు మాట్లాడుతూ.. కార్తీక్ రెడ్డి జ్ఞాపకాలను మరియు ప్రజలతో తను కలిసిపోయే మనస్తత్వం తలుచుకొని భావోద్వేగo చెందారు, కార్తీకరెడ్డి బౌతికంగా మా మధ్యలో లేకున్నా అతని స్ఫూర్తితో నిరంతరం సేవ కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు, 

ఈ కార్యక్రమంలో కార్తీక్ రెడ్డి అభిమానులు మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని 200 మంది వరకు రక్త దానం చేసారు,

ఈ రక్తదాన కార్యక్రమానికి సహకరించిన కారుణ్య హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
బిగించిన విద్యుత్ స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలి* *విద్యుత్ కార్యాలయం ముందు సిపిఐ అందోళన*
కోడుమూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో పేదల జీవితాలతో...
By mahaboob basha 2025-07-26 10:44:04 0 886
Andhra Pradesh
తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం: రోడ్డు ప్రమాదం లో హై స్కూల్ టీచర్ మృతి
మొగరాల పంచాయతీ లో గిరికినెట్టుగ్రామానికి చెందిన శ్రీ నివాసులు టిచర్ ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు...
By Karapati Gopi 2025-12-29 04:59:39 0 299
Telangana
రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
సికింద్రాబాద్ :  పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపామని రాష్ట్ర...
By Sidhu Maroju 2025-09-27 10:43:26 0 222
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com