ఆటోలు మర్చిపోయిన బంగారాన్ని గంటల వ్యవధిలోనే బాధితులకు అందజేసిన పోలీసులు.|

0
151

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  శనివారం నాడు, ఆంధ్ర లోని విజయవాడ నుంచి బొల్లారం తుర్కపల్లి కి గృహప్రవేశం నిమిత్తం వచ్చిన షేక్ సన, తిరుగు ప్రయాణం చేద్దామని ట్రైన్ కోసం సఫీల్ గూడ వెళ్లారు. అక్కడ వారికి ట్రైన్ మిస్ అవ్వడంతో  బొల్లారం తుర్కపల్లి కి ఆటోలో తిరుగుప్రయాణం అయ్యారు.

వారు తీసుకువెళ్లిన అన్ని లగేజ్ బ్యాగులు ఇంట్లోకి తెచ్చుకున్నారు కానీ ఒక లగేజ్ బ్యాగు అందులో 18 తులాల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న  బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు.

ఆదివారం నాడు బ్యాగులు చెక్ చేయగా అందులో ఒక బ్యాగ్ మిస్ అయిందని అందులోనే బంగారు నగలు ఉన్నాయని గమనించి వెంటనే  ఆల్వాల్ పోలీస్ స్టేషన్ కి ఆదివారం మధ్యాహ్నం వచ్చి పోలీసులను ఆశ్రయించగా, అక్కడ విధుల్లో వున్న ఎస్సై చంద్రశేఖర్  సానుకూలంగా స్పందించి, ఎస్.హెచ్.ఓ అల్వాల్, మరియు డీఐ తిమ్మప్ప ఆదేశాలను అనుసరిస్తూ అట్టి ఆటోను మూడు గంటల వ్యవధిలోని ట్రేస్ చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్ కు రప్పించారు.

బాధితురాలుకు సంబంధించిన బ్యాగును మరియు అందులో ఉన్న 18 తులాల విలువైన బంగారు నగలను సదరు బాధితురాలికి అప్పగించారు.

ఆటోలో మర్చిపోయిన అట్టి బ్యాగును,  బంగారు నగలను సదరు ఆటో డ్రైవర్ రాజేష్ బాధ్యతతో తిరిగి తెచ్చినందుకు అభినందనలు తెలియజేశారు. 

అలాగే, ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలని ఎస్సై చంద్రశేఖర్  సదురు మహిళలకు సూచించారు. తమకు సత్వరన్యాయం అందించిన పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలియచేసారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం భాష్యం స్కూల్ సమీపంలో సింగం వారి పల్లి గ్రామానికి...
By Kothuru Murali 2026-01-28 09:02:56 0 103
Andhra Pradesh
ఏపీ వర్క్స్ బోర్డ్ ఏడాది కాలం పనితీరు దేశానికి ఆదర్శం
పత్రికా ప్రకటన   విజయవాడ, 16-12-2025   - ఏపీ వక్ఫ్ బోర్డ్ ఏడాది కాలం పనితీరు...
By Rajini Kumari 2025-12-16 12:39:34 0 173
Andhra Pradesh
బాపట్ల చేరుకున్న మహారాష్ట్ర యోగా టీం
బాపట్ల చేరుకున్న మహారాష్ట్ర యోగా టీం....  బాపట్ల: జాతీయస్థాయి యోగాసనా ఛాంపియన్షిప్ 2025...
By Gadiyapudi Narendra 2025-12-27 10:47:09 0 293
Andhra Pradesh
రైతులకు ‘అన్నదాత సుఖీభవ’, పీఎం కిసాన్ నిధుల విడుదల.
అన్నమయ్య జిల్లాలో 1,88,408 మంది రైతులకు మూడో విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రూ. 108.37...
By Pagadala Venkateswar 2026-03-13 07:12:58 0 91
Andhra Pradesh
KL యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ పరీక్ష ఫలితాలు విడుదల
*కె ఎల్ యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.* ఆడపిల్లకు చదువే అసలైన...
By Rajini Kumari 2026-01-10 12:42:30 0 115
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com