ఎన్టీఆర్ జిల్లా హోటల్స్ కు గ్యాస్ కొరత నివారించాలి

0
83

*ప్రెస్ నోటు*

*తేదీ : 13-3-2026,శుక్రవారం*

*విజయవాడ, కలెక్టరేట్*

 

*హోటల్ రంగానికి గ్యాస్ కొరతను నివారించాలి – బ్లాక్ మార్కెట్ అమ్మకాలను అరికట్టాలి. హోటల్ వర్కర్స్ ను ప్రభుత్వం ఆదుకోవాలి. వారి జీవనోపాధి కాపాడాలి.*

 

*ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర విజయవాడ హోటల్ & బేకరీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నిరసన*

 

*అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. మరియు నగరంలో మూతపడిన గుడ్ మార్నింగ్ హోటల్ వర్కర్స్ తో మాట్లాడడం జరిగింది. గ్యాస్ కొరత వల్ల మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం మమ్మల్ని ఆడుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.*

 

*ఈ సందర్భంగా సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె. దుర్గారావు మాట్లాడుతూ*

 

📍విజయవాడ నగరంలో హోటల్ రంగానికి అవసరమైన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందినీ అన్నారు.ఈకారణంగా చిన్న, మధ్యతరహా హోటళ్ల నిర్వహణ చాలా కష్టంగా మారిందినీ గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల అనేక హోటళ్లలో వంట కార్యకలాపాలు అంతరాయం కలుగుతున్నాయిని. దీనివల్ల హోటల్ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతోందిని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించాలని కోరారు.

 

📍ఇక మరోవైపు కొంతమంది వ్యాపారులు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయిని అన్నారు. ఇది హోటల్ యాజమాన్యాలకు మరింత భారం అవుతోందిని తెలిపారు. ప్రభుత్వము వెంటనే దీనిపై దృష్టి సారించి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే బ్లాక్ మార్కెట్ గ్యాస్ అమ్మకాలను కట్టడి చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కమర్షియల్ గ్యాస్ బండ 3 వేలకు పైగా అమ్ముతున్నారని తెలిపారు.

 

*సిఐటియు నగర కార్యదర్శి ఎం.సోమేశ్వరావు, విజయవాడ హోటల్ & బేకరీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం.వి. రమణ మాట్లాడుతూ*

 

గ్యాస్ కొరత సమస్య వల్ల నగరంలో చాలా హోటల్స్ మూతబడుతున్నాయని దీనివల్ల హోటల్ వర్కర్స్ కే కాకుండా సాధారణమైన ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.తక్షణమే హోటల్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించి హోటల్ రంగాన్ని, ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఉపాధిని కాపాడాలని విజయవాడ హోటల్ & బేకరీ వర్కర్స్ యూనియన్ (CITU) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందిని అన్నారు.సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోకపోతే యూనియన్ ఆధ్వర్యంలో అందరిని కలుపుకొని ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

 

*ఈ కార్యక్రమంలో విజయవాడ హోటల్ & బేకరీ వర్కర్స్ యూనియన్ (CITU) నగర నాయకులు కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు*

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజాస్వామ్య పునాదికి ఓటు హక్కు చానా విలువైనది ఆర్డీవో రాయచోటి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చానా విలువైనది అని ట్రై డ్యూటీ ఆర్డీవో పేర్కొన్నారు అలాగే ర్యాలీలో...
By Benguluri Madhubabu 2026-01-25 08:36:53 0 204
Andhra Pradesh
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
By Kothuru Murali 2026-02-15 05:43:43 1 451
Entertainment
India enter T20 world Cup final
టీ20 వరల్డ్‌ కప్‌: ఫైనల్‌లోకి భారత్‌ 🏏🇮🇳 టీ20 వరల్డ్‌ కప్‌ రెండో...
By G k Nookala 2026-03-05 17:40:08 0 60
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com