దీక్ష దివస్ ను పురస్కరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.|

0
202

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  ఈరోజు “దీక్ష దివస్”ను పురస్కరించుకొని మల్కాజ్గిరి నియోజకవర్గంలో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి. 

మల్కాజిగిరి చౌరస్తా వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  చిత్రపటానికి పాలాభిషేకం చేశాక, అనంతరం వినాయక నగర్ చౌరస్తా, నేరేడ్మెట్ చౌరస్తా, అల్వాల్ మీ సేవ చౌరస్తాలలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

అక్కడి నుంచి కార్ల ర్యాలీగా గండి మైసమ్మ – మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు ప్రస్తుత కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బయలుదేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  మాట్లాడుతూ—

కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ప్రజల కోసం చేసిన నిరంతర దీక్షలు, పోరాటాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. ప్రజల హక్కుల కోసం, తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించేందుకు ఈ రోజు “దీక్ష దివస్”ను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఏం బీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్,కార్పొరేటర్లు మేకల సునీత రాము యాదవ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, రావుల అంజయ్య,  జేఏసి వెంకన్న, తోట నరేందర్ రెడ్డి, డోలి రమేష్, ఢిల్లి పరమేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన విభాగం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: భద్రకాళి రూపంలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణంలో శనివారం అమావాస్య సందర్భంగా శ్రీ విరుపాక్షి మారెమ్మ భద్రకాళి రూపంలో భక్తులకు...
By Kothuru Murali 2026-05-16 15:48:13 0 89
Andhra Pradesh
TTD: శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్.
శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులకు మంచి రోజులొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన...
By Pagadala Venkateswar 2026-03-18 03:17:19 0 172
Telangana
రామగుండం నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ...
By Rangu Srinivas 2026-03-27 12:15:52 3 2K
Andhra Pradesh
వనమలదిన్నెలో వృద్ధుడిపై దాడి
పుంగనూరు మండలం, వనమలదిన్నె గ్రామంలో భూ వివాదంలో 90 ఏళ్ల వెంకటస్వామిపై ఆయన బామ్మర్ది శ్రీరాములుతో...
By Kothuru Murali 2026-06-09 13:33:04 0 72
Telangana
బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం
భారత్ ఆవాజ న్యూస్ రాజాపేట  మే 13 ఎన్డిడిబి తో మదర్ డైరీ ఒప్పందం కుదరచడంలో కీలకపాత్ర పోషించి...
By Pindikura Mahesh 2026-05-14 03:46:12 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com