రామగుండం నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి

3
2K

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్ తో పాటు ఎస్సీ ఎస్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సింగరేణి ఆర్జి వన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ సతి సమేతంగా హాజరై శ్రీ సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ ప్రాంతంలోని పలు దేవాలయాల్లో జరుగుతున్న వేడుకలకు ముఖ్య అతిథులుగా వేరు వేరుగా వీరు హాజరయ్యారు. గోదావరిఖని లోని ప్రధాన కోదండ రామాలయానికి ఎమ్మెల్యే తన సతీమణితో పట్టు వస్త్రాలతో తలంబ్రాలను నెత్తిపై తాంబూలంలో పెట్టుకొని వచ్చి బ్రాహ్మణ పురోహితులకు రామాలయంలో తలంబ్రాలను అందజేశారు. అర్జీ వన్ జనరల్ మేనేజర్ జిఎం కాలనీ, శారద నగర్ ఏరియాలో ఉండే దేవాలయాలకు అతిథులుగా హాజరై పూజలు నిర్వహించారు. అక్కడి భక్తులు అడిగిన సౌకర్యాలను తప్పకుండా సమకూరుస్తానని జిఎం లలిత్ కుమార్ హామీ ఇచ్చారు. అలాగే జిఎం కాలనీలో ఉండే ఆంజనేయస్వామి ఆలయంలో వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 60 డివిజనల్ లలో ఉండేటువంటి ఆంజనేయస్వామి దేవాలయాల వద్ద ఎనిమిదవ కాలనీ, విట్టల్ నగర్, తిలక్ నగర్,  కళ్యాణ్ నగర్, గౌతమి నగర్, ద్వారకా నగర్ ఆ ఏరియాలో ఉండే కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతమంతా జైశ్రీరామ్ అంటూ జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ కేరింతల కొడుతూ ప్రతి దేవాలయాల వద్ద వేలాది మంది భక్తులతో పూజలు నిర్వహించారు. 

రంగు శ్రీనివాస్ 

రామగుండం మండలం రిపోర్టర్

పెద్దపల్లి జిల్లా 

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
నెల్లూరు మహానాడు ఏర్పాట్లపై కీలక సమావేశానికి హాజరైన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పార్థసారధి గారు తిరుపతి ఎయిర్పోర్టులో గనస్పాగతం
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం కిసాన్ సేస్ వద్ద ఈనెల 27 28 29 తేదీల్లో...
By Benguluri Madhubabu 2026-05-13 06:22:26 0 80
Andhra Pradesh
మంత్రికి ఘన స్వాగతం: పీలేరులో కూటమి పార్టీల నేతల ఆత్మీయ పలకరింపు
పీలేరు నియోజకవర్గం కలికిరి వద్ద కూటమి పార్టీ నేతలు, జంగమ కార్పొరేషన్ ఛైర్మన్ వాసునూరి చంద్రశేఖర్,...
By Kothuru Murali 2026-03-03 11:51:28 0 89
Andhra Pradesh
నిమ్మలపల్లి నాటు బాంబు పేలి కుక్క మృతి.
నిమ్మనపల్లె మండలం ముష్టూరులో కుర్రా శ్రీధర్ పెంపుడు కుక్క నాటు బాంబు పేలడంతో మృతి చెందింది. చేపలు...
By Pagadala Venkateswar 2026-05-02 04:05:07 0 62
Telangana
అంగరంగ వైభవంగా మల్లంపల్లి గ్రామంలో హనుమాన్ భక్తుల నగర సంకీర్తన...
అంగరంగ వైభవంగా మల్లంపల్లి లో హనుమాన్ భక్తుల నగర సంకీర్తన....   భారత్ అవాజ్ న్యూస్:...
By Gujile Ramu 2026-05-05 16:34:41 0 102
Business
Gold and Silver Prices Decline Amid Tepid Demand: City-Wise Rates on May 20, 2025
Gold and Silver Prices Decline Amid Tepid Demand: City-Wise Rates on May 20, 2025 On May 20,...
By BMA ADMIN 2025-05-20 06:19:01 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com