దీక్ష దివస్ ను పురస్కరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.|

0
200

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  ఈరోజు “దీక్ష దివస్”ను పురస్కరించుకొని మల్కాజ్గిరి నియోజకవర్గంలో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి. 

మల్కాజిగిరి చౌరస్తా వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  చిత్రపటానికి పాలాభిషేకం చేశాక, అనంతరం వినాయక నగర్ చౌరస్తా, నేరేడ్మెట్ చౌరస్తా, అల్వాల్ మీ సేవ చౌరస్తాలలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

అక్కడి నుంచి కార్ల ర్యాలీగా గండి మైసమ్మ – మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు ప్రస్తుత కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బయలుదేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  మాట్లాడుతూ—

కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ప్రజల కోసం చేసిన నిరంతర దీక్షలు, పోరాటాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. ప్రజల హక్కుల కోసం, తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించేందుకు ఈ రోజు “దీక్ష దివస్”ను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఏం బీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్,కార్పొరేటర్లు మేకల సునీత రాము యాదవ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, రావుల అంజయ్య,  జేఏసి వెంకన్న, తోట నరేందర్ రెడ్డి, డోలి రమేష్, ఢిల్లి పరమేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన విభాగం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
జయహో హిందూ ముస్లిం ఏక్ హై
జైహో జైహో హిందూ ముస్లిం ఎక్ హో..   జైహో జైహో సబ్ హిందూస్థాని ఏక్ హో...   ఈరోజు...
By Rajini Kumari 2026-01-28 13:03:25 0 169
Andhra Pradesh
పుంగనూరు: అగ్నిప్రమాదంలో రూ 20 వేల నష్టం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో సోమవారం వరిగడ్డి వామికి అగ్ని ప్రమాదం...
By Kothuru Murali 2026-03-17 07:01:17 0 161
SURAKSHA
Kathawate Mayur Ashok IAS: A Visionary in Public Service
A dynamic 2015-batch Andhra Pradesh cadre IAS officer, Shri Kathawate Mayur Ashok has earned...
By Lokeshwari Panthadi 2026-07-16 12:12:52 0 68
SURAKSHA
Securing Our Shores: Lakshadweep’s Coastal Defense System
Lakshadweep’s unique island geography demands a highly specialized approach to maritime...
By Lokeshwari Panthadi 2026-07-03 07:51:35 0 44
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి దేవాలయ ప్రతిష్ట పారిశుద్ధ్య కార్మికులు చేతిలోనే ఉంది ఈవో సీనా నాయక్
పత్రికా ప్రకటన ఇంద్రకీలాద్రి, 22 జనవరి 2026   దేవాలయ ప్రతిష్ట పారిశుధ్య కార్మికుల...
By Rajini Kumari 2026-01-22 12:20:37 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com