లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే.|

0
92

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం నేరుగా ప్రజలకు చేరేలా ఎమ్మెల్యే  ప్రత్యేకంగా పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో చెక్కులు అందుకున్న లబ్ధిదారులు:

బాలాజీ యాదవ్ (అల్వాల్ డివిజన్) – రూ. 37,500

నవీన్ రాజు (అల్వాల్ డివిజన్) – రూ. 13,500

వాణి (వినాయక్ నగర్ డివిజన్) – రూ. 11,500

షేక్ జిలాని (మచ్చ బొల్లారం డివిజన్) – రూ. 21,000

ఎమ్మెల్యే  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవసరమైన వారికి ప్రభుత్వం అందిస్తున్న సాయం ఎంతో మందికి ఆశగా నిలుస్తోందని తెలిపారు. మరింత మంది లబ్ధిదారులకు కూడా ఈ సహాయం అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమం లో  కార్పొరేటర్ శ్రీమతి చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, బద్దం పరశురాం రెడ్డి, నాయకులు డోలి రమేష్,  తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ :   ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు...
By Sidhu Maroju 2025-09-12 07:33:38 0 209
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఒక వరం... ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: ఏపీ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఒక వరం... ఇది ఫార్వర్డ్ లుకింగ్...
By Pagadala Venkateswar 2026-02-02 05:11:59 0 36
Telangana
బైరం చెరువుకు రక్షణ కవచం నిర్మించాలి- ప్రజావాణిలో వినతి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బాచుపల్లి పరిధిలోని బైరం చెరువు (పెద్ద చెరువు)...
By Sidhu Maroju 2025-12-29 15:46:07 0 76
Telangana
కన్నెత్తి చూడని మంత్రులు, అధికారులు ...
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని నిర్మించిన రామదాసును...
By Krishna Balina 2026-01-24 14:32:43 0 222
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com