జగన్ పై కూటమి నేతలు అక్కసును వెళ్లగక్కడమే పనిగా పెట్టుకున్నారా? దుర్భుద్ధి తో చూసే వారికీ ప్రజాభిమానం ఎలా తెలుస్తుంది..సయ్యద్ గౌస్ మోహిద్దీన్

0
534

జగన్ పై కూటమి నేతలు అక్కసును వెళ్లగక్కడమే పనిగా పెట్టుకున్నారా దుర్భుద్ధి తో చూసే వారికీ ప్రజాభిమానం ఎలా తెలుస్తుంది సయ్యద్ గౌస్ మోహిద్దీన్ వైసీపీ మైనారిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్కాపురం.వైసిపి అధినేత మాజీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్ళిన నేపథ్యంలో అభిమానంతో ప్రజలు ఆయన్ని చూసేందుకు వచ్చారని,దుర్భుదీతో ఆలోచించే టీడీపీ నేతలకు జనాభిమానం అంటే ఏం తెలుస్తుందని వైసీపీ మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ గౌస్ మోహిద్దీన్ శుక్రవారం నాడు ఒక ప్రకటన లో విమర్శించారు.ఈ సందర్బంగా వైసీపీ నేత సయ్యద్ గౌస్ మోహిద్దీన్ మాట్లాడుతు చంద్రబాబుకు లేని ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్న ఆసూయ టీడీపీ నేతల్లో గూడుకట్టుకొందన్నారు.జగన్ కు ఉండే ప్రజాభిమానం చూడలేక,ఓర్వలేక టీడీపీ నేతలు ఆసూయతో విమర్శలు చేస్తున్నారని ఆయన ఏద్దేవా చేశారు. వాస్తవాన్ని ఒప్పుకోవడం టీడీపీ నేతలు అలవాటు చేసుకోవాలన్నారు. లేకపోతే కడుపుమంటతో టీడీపీ నేతలు కుమిలి పోవటం తప్పా మరో మార్గం వారికి లేదన్నారు. ఆసూయ పూరిత విమర్శలు పక్కనపెట్టి ఏపీలో పాలనను టీడీపీ నేతలు గాడిలో పెడితే బాగుంటుందని ఆయన సూచించారు...

Search
Categories
Read More
Andhra Pradesh
పాత నేరస్తులకు మెగా కౌన్సెలింగ్: మహిళల గౌరవానికి ప్రతిజ్ఞ.
అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లిలో ‘మెగా కౌన్సెలింగ్ - పరివర్తన...
By Pagadala Venkateswar 2026-04-23 03:38:55 0 56
Andhra Pradesh
డోన్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
*For Scrolls...*   నంద్యాల జిల్లా   * డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-03-10 08:52:33 0 142
Maharashtra
Rain Alerts in Maharashtra Caution or Overreaction
The India Meteorological Department (#IMD) has issued orange and yellow alerts for Pune, Raigad,...
By Pooja Patil 2025-09-15 04:33:58 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com