Lakshmi Deepika: లక్ష్మీదీపిక ‘డబుల్’ ధమాకా: తెలంగాణ తర్వాత ఏపీ గ్రూప్-1లోనూ స్టేట్ టాపర్!

0
222

రెండు రాష్ట్రాల్లోనూ మొదటి ర్యాంకు సాధించిన ఘనత

ఉస్మానియాలో ఎంబీబీఎస్.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్‌

 

కోచింగ్ లేకుండానే కొట్టిన లక్ష్మీదీపిక

తదుపరి లక్ష్యం సివిల్స్ అంటూ వెల్లడి

పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించారు లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి. ఇటీవలే తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన ఆమె, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 ఫలితాల్లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. స్థానికేతర కోటాలో ఏపీ పరీక్ష రాసినప్పటికీ, తన ప్రతిభతో అక్కడ కూడా టాపర్‌గా నిలిచారు.

 

హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన లక్ష్మీదీపిక కుటుంబ నేపథ్యం అంతా ఆంధ్రప్రదేశ్‌తో ముడిపడి ఉంది. తండ్రి కృష్ణది కోనసీమ జిల్లా అమలాపురం కాగా, తల్లి పద్మావతిది పశ్చిమ గోదావరి జిల్లా. ప్రస్తుతం ఆమె తెలంగాణ గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై శిక్షణలో ఉన్నారు. ఇప్పుడు ఏపీలోనూ అదే పోస్టు రావడంతో, ఎక్కడ కొనసాగాలనే విషయంపై ఆమె ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

 

లక్ష్మీదీపిక విద్యాభ్యాసం అంతా మెరిటోరియస్‌గా సాగింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె, ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్ వైపు అడుగులు వేశారు. గతంలో ఏపీలో ఎంపీడీవో పోస్టు వచ్చినప్పటికీ, తన లక్ష్యం కోసం ఆ ఉద్యోగంలో చేరలేదు. యూపీఎస్సీ కోసం సిద్ధమవుతున్న క్రమంలోనే ఎలాంటి ప్రత్యేక శిక్షణ తీసుకోకుండా, కేవలం సివిల్స్ ప్రిపరేషన్‌తోనే రెండు రాష్ట్రాల గ్రూప్-1 పరీక్షల్లో టాపర్‌గా నిలవడం విశేషం.

 

పరీక్షల సమయంలో రోజుకు ఆరు గంటలు మాత్రమే చదివినట్లు లక్ష్మీదీపిక తెలిపారు. గ్రూప్స్ పరీక్షల్లో ఆప్షనల్ సబ్జెక్టులు ఉండవు కాబట్టి జనరల్ స్టడీస్‌పై పట్టు సాధించడం తనకు కలిసి వచ్చిందని వివరించారు. ఇప్పటికే రెండుసార్లు సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లిన ఆమె, తన అంతిమ లక్ష్యం ఐఏఎస్ సాధించడమేనని స్పష్టం చేశారు. ఒకే అభ్యర్థి రెండు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

Search
Categories
Read More
Telangana
చెమటలో చరిత్ర రాసి మే డే సందర్భంగా రాసిన పాట ఎస్సీ ఎస్టీ జనరల్ సెక్రటరీ గంగారం లింగమూర్తి ఆధ్వర్యంలో ఆవిష్కరణ
స్థానిక పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని 16:30 / 1982 ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో...
By Pinnehasan Odela 2026-04-30 16:31:02 0 467
Telangana
మొక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవ్ రెడ్డి గారు....
నెక్కొండ:  భారత్ అవాజ్ న్యూస్ :కేంద్రాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన...
By Gujile Ramu 2026-04-27 13:42:49 0 247
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:30 0 43
Andhra Pradesh
రోడ్డు పక్కన తాటి ముంజలను ఆస్వాదించిన చంద్రబాబు, భువనేశ్వరి.
నేడు కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, భువనేశ్వరి తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద ఆగిన...
By Pagadala Venkateswar 2026-05-20 13:58:53 0 71
Andhra Pradesh
దౌర్జన్య ఘటనలపై చర్యలు తీసుకోవాలి : మదనపల్లి ఎమ్మెల్యే
ఆదివారం నాడు టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాసరావు ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి...
By Pagadala Venkateswar 2026-04-13 12:20:28 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com