హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి ఘన సన్మానం.|

0
107

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్‌ బర్టన్‌గూడ లోని హిందూ స్మశానవాటిక అభివృద్ధికి రూ.1 కోటి 90 లక్షలు మంజూరు చేయించడంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మరియూ స్థానిక కార్పొరేటర్ లను హిందూ స్మశాన వాటిక కమిటీ ఘనంగా సన్మానించింది. 

 

ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ..

 

స్మశానవాటిక అభివృద్ధికి కావాల్సిన నిధులు పొందేందుకు పైస్థాయి అధికారులను నిరంతరం అనుసంధానం చేస్తూ అనుమతులు పొందగలిగామని స్మశానవాటికను మోడల్ గ్రేవియర్డ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని అయన తెలిపారు.

 

ప్రజల సమస్యలను మాటల్లో కాదు… చేతల్లో చూపడమే తమ పని తీరు అని, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన వివరించారు.

 

ఈ కార్యక్రమంలో హిందూ స్మశానవాటిక కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణా గౌడ్, సూర్య కిరణ్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

 

Sidhumaroju

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
ఆరు విడుతల డీ.ఏ ల బకాయిలను చెల్లించాలి-డి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు నెల్లుట్ల భాస్కర్
మహబూబాబాద్, కొత్తగూడ, జనవరి 7(భారత్ అవాజ్): మండల విద్యా వనరుల కేంద్రం కొత్తగూడ కార్యాలయంలో MEO...
By Bittu Bittu 2026-01-07 09:11:48 0 255
Andhra Pradesh
మదనపల్లిలో బిడ్డ మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోతబోలు హరిజనవాడకు చెందిన...
By Pagadala Venkateswar 2026-01-26 05:33:29 0 50
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com