ఆరు విడుతల డీ.ఏ ల బకాయిలను చెల్లించాలి-డి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు నెల్లుట్ల భాస్కర్

0
255

మహబూబాబాద్, కొత్తగూడ, జనవరి 7(భారత్ అవాజ్): మండల విద్యా వనరుల కేంద్రం కొత్తగూడ కార్యాలయంలో MEO గుమ్మడి లక్ష్మీనారాయణచే డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ కొత్తగూడ మండల శాఖ డైరీ గోడపత్రిక టేబుల్ క్యాలెండర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఉన్నతమైన ఆలోచనలు కలిగి సామాజిక అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. నెల్లుట్ల భాస్కర్ డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వo వద్ద బకాయిగా ఉన్న ఆరు విడుతల దినసరీ భత్యాన్ని (D.A ) విడుదల చేయాలని, పిఆర్సి నివేదికను తెప్పించుకొని, పిఆర్సి ని అమలు చేయాలని, రిటైర్ ఉపాధ్యాయులకు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్. విష్ణువర్ధన్ రావు, చాట్ల పోట్టయ్య, వాసం ప్రభాకర్, ఎన్. సుమన్, డి.సుధాకర్, ఏ. కోటేశ్వర్, డి.సరస్వతి, ఈ.ప్రమీల, ఏం. సూరయ్య, టి.బిక్షపతి, బి.రమేష్, యాప.బ్రహ్మయ్య, ఎం రవి, డి.లక్ష్మణ్, బి. వెంకన్న ఓ.సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం
రహదారులు నిర్మించండి తూర్పు బీసీ కాలనీలోని 5వ వార్డులో వర్షాలకు రహదారులన్నీ బు రదమయమై ప్రజలకు...
By mahaboob basha 2025-09-30 18:34:16 0 199
Andhra Pradesh
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ మహమ్మద్ భవానిపురం ఇంటి వద్ద ACB సోదాలు
ఎన్టీఆర్    మైలవరం నియోజకవర్గం     ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ సబ్ రిజిస్టర్...
By Rajini Kumari 2025-12-23 10:20:00 0 103
Andhra Pradesh
మాజీ ప్రధాని విగ్రహ ఆవిష్కరణ
కర్నూలు :  దేశ మాజీ ప్రధాని దివంగత శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య  విగ్రహాన్ని...
By Hari Krishna 2025-12-12 14:00:55 0 208
Andhra Pradesh
మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకున్న కేశినేని నాని గారు
*మేడారం సమ్మక్క–సారక్క గద్దెను దర్శించుకున్న కేశినేని నాని గారు*   * ములుగు జిల్లా...
By Rajini Kumari 2026-01-13 15:44:10 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com