ఆరు విడుతల డీ.ఏ ల బకాయిలను చెల్లించాలి-డి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు నెల్లుట్ల భాస్కర్
మహబూబాబాద్, కొత్తగూడ, జనవరి 7(భారత్ అవాజ్): మండల విద్యా వనరుల కేంద్రం కొత్తగూడ కార్యాలయంలో MEO గుమ్మడి లక్ష్మీనారాయణచే డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ కొత్తగూడ మండల శాఖ డైరీ గోడపత్రిక టేబుల్ క్యాలెండర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఉన్నతమైన ఆలోచనలు కలిగి సామాజిక అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. నెల్లుట్ల భాస్కర్ డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వo వద్ద బకాయిగా ఉన్న ఆరు విడుతల దినసరీ భత్యాన్ని (D.A ) విడుదల చేయాలని, పిఆర్సి నివేదికను తెప్పించుకొని, పిఆర్సి ని అమలు చేయాలని, రిటైర్ ఉపాధ్యాయులకు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్. విష్ణువర్ధన్ రావు, చాట్ల పోట్టయ్య, వాసం ప్రభాకర్, ఎన్. సుమన్, డి.సుధాకర్, ఏ. కోటేశ్వర్, డి.సరస్వతి, ఈ.ప్రమీల, ఏం. సూరయ్య, టి.బిక్షపతి, బి.రమేష్, యాప.బ్రహ్మయ్య, ఎం రవి, డి.లక్ష్మణ్, బి. వెంకన్న ఓ.సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz