స్వర్గీయ ఇందిరా గాంధీ 108 వ జయంతి— నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
219

సికింద్రాబాద్ : జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం వద్ద వారి 108 వ జయంతి కార్యక్రమం స్ధానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్  దేశానికి వారు చేసిన సేవలను కొనియాడి, వారి స్పూర్తితోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని చెప్పారు. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ..

శ్రీమతి ఇందిరా గాంధీ చిన్నతనంలోనే  తండ్రి నెహ్రూ, మహాత్మా తో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని, వారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారని, భారతదేశం ఆహారాన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి భారత దేశ అవసరాలకు సరిపోను ఆహారాన్ని ఉత్పత్తి చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి తీసుకువచ్చారని, పాకిస్తాన్ పై యుద్ధం చేసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసిన ఘనత కూడా శ్రీమతి ఇందిరా గాంధీ గారికి దక్కుతుందని, ఆ యుద్ధ సమయంలో అమెరికా మాటలు కూడా ఖాతరు చేయలేదని, భారతదేశ సార్వభౌమత్యాన్ని కాపాడిన వ్యక్తి ఇందిరాగాంధీ అన్నారు,

దేశంలో 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయకరణ చేసి సంపన్న వర్గాలకే పరిమితమైన బ్యాంకులను పేద ప్రజలు కూడా బ్యాంకులకు వెళ్లే విధంగా చేసిన మహనీయురాలని, అందుకే ఆమెను ఉక్కు మహిళ అంటారని, భారతదేశానికి మొదటి, ఏకైక మహిళా ప్రధానిగా గుర్తింపు పొందారని వారి స్ఫూర్తితోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పం కూడా ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే వచ్చిందని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : కోటి రూపాయల గల భూమిచిత్తూరు జిల్లా,
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, బండ కింద పల్లి గ్రామంలో శనివారం సుమారు...
By Kothuru Murali 2026-04-19 11:00:54 0 94
Andhra Pradesh
ఓటర్ల జాబితాపై ఆందోళన వద్దు: పుంగనూరు ఎమ్మార్వో రాము
పుంగనూరు ఎమ్మార్వో రాము మాట్లాడుతూ, SIR (స్పెషల్ ఇంటెన్స్ రివిజన్) కార్యక్రమం ఈనెల 5 నుంచి 14...
By Kothuru Murali 2026-06-02 15:19:43 0 85
Andhra Pradesh
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన
చంద్రబాబు “వెన్నుపోటుకు రెండేళ్లు”నిరసన కార్యక్రమం.!   వై.యస్.ఆర్ కాంగ్రెస్...
By Rajini Kumari 2026-06-13 10:21:13 0 210
Telangana
"మల్కాజిగిరిలో మహిళ హత్య కేసు ఛేదన.. గంటల్లోనే నిందితుడి అరెస్ట్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలకలం రేపిన మహిళ హత్య...
By Sidhu Maroju 2026-06-11 14:34:53 0 160
Telangana
₹. 50 లక్షల విలువైన గంజాయి పట్టివేత – నలుగురు అరెస్ట్.|
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు....
By Sidhu Maroju 2026-04-05 09:12:34 0 322
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com