స్వర్గీయ ఇందిరా గాంధీ 108 వ జయంతి— నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
108

సికింద్రాబాద్ : జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం వద్ద వారి 108 వ జయంతి కార్యక్రమం స్ధానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్  దేశానికి వారు చేసిన సేవలను కొనియాడి, వారి స్పూర్తితోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని చెప్పారు. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ..

శ్రీమతి ఇందిరా గాంధీ చిన్నతనంలోనే  తండ్రి నెహ్రూ, మహాత్మా తో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని, వారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారని, భారతదేశం ఆహారాన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి భారత దేశ అవసరాలకు సరిపోను ఆహారాన్ని ఉత్పత్తి చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి తీసుకువచ్చారని, పాకిస్తాన్ పై యుద్ధం చేసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసిన ఘనత కూడా శ్రీమతి ఇందిరా గాంధీ గారికి దక్కుతుందని, ఆ యుద్ధ సమయంలో అమెరికా మాటలు కూడా ఖాతరు చేయలేదని, భారతదేశ సార్వభౌమత్యాన్ని కాపాడిన వ్యక్తి ఇందిరాగాంధీ అన్నారు,

దేశంలో 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయకరణ చేసి సంపన్న వర్గాలకే పరిమితమైన బ్యాంకులను పేద ప్రజలు కూడా బ్యాంకులకు వెళ్లే విధంగా చేసిన మహనీయురాలని, అందుకే ఆమెను ఉక్కు మహిళ అంటారని, భారతదేశానికి మొదటి, ఏకైక మహిళా ప్రధానిగా గుర్తింపు పొందారని వారి స్ఫూర్తితోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పం కూడా ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే వచ్చిందని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు...
By Benguluri Madhubabu 2026-01-31 04:24:01 0 130
Telangana
హైడ్రా కార్యాలయం ముందు డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసన
సికింద్రాబాద్ :బుద్దభవన్.   హైడ్రా కార్యాలయం ముందు హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసన....
By Sidhu Maroju 2025-09-17 08:31:40 0 179
Andhra Pradesh
మదనపల్లి: నెలలో తల్లిదండ్రులు రాకపోతే అనాధగా ప్రకటింపు.
మదనపల్లి బాలాజీ నగరులో పురిటి ఆడ శిశువును వదిలి వెళ్లిన ఘటనపై పోలీసులు, ఐసిడియస్ సిబ్బంది...
By Pagadala Venkateswar 2026-01-24 06:16:41 0 52
Telangana
శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించండి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్.      మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-08-03 16:39:26 0 689
Andhra Pradesh
బి కొత్తకోట : యువతి అదృశ్యంపై కేసు నమోదు.
కొత్తకోటలోని బిసికాలనీలో మహమ్మద్ హుస్సేన్ కుమార్తె ఆర్షియా (18) అదృశ్యమైంది. ఇంటర్మీడియట్ వరకు...
By Pagadala Venkateswar 2026-02-08 11:09:42 0 41
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com