మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ పోలీసుల కార్డన్ సెర్చ్.|

0
208

మేడ్చల్ మల్కాజ్గిరి :  మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 250 మంది పోలీస్ సిబ్బందితో అల్వాల్ ల్లో భారీగా కార్ధన్ సెర్చ్ నిర్వహించారు. హస్మత్ పెట్, అంజయ్య నగర్, పాత బోయిన్ పల్లి, కాలనీలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 22 వాహనాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 130 వాహనాలపై పెండింగ్ లో వున్న సుమారు 50 వేల రూపాయల చాలన్ లను వసూలు చేశారు. అలాగే బెల్ట్ షాపులలో అక్రమంగా విక్రయిస్తున్న 46 లీటర్ మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేర చరిత్ర కలిగిన 11 మందితో పాటు 19 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు డీసీపీ వెల్లడించారు.

తమ పరిధిలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో పోలీసులు విస్తృతంగా చేసిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్ విజయవంతం అయింది.ఆల్వాల్ పోలీసులు హస్మత్‌పేట్ ప్రాంతంలో జరిపిన ఈ కార్ధన్ సెర్చ్ ప్రత్యేకంగా ప్రజలలో మానసిక బలాన్ని నింపింది.

ఈ ప్రత్యేక డ్రైవ్‌ను మేడ్చల్ డీసీపీ పర్యవేక్షణలో, అడిషనల్ డీసీపీ పురుషోత్తం, పెట్ బషీరాబాద్ ఏసీపీ, బాల గంగిరెడ్డి, మేడ్చల్ ఏసీపి, శంకర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకరయ్య,  ఆల్వాల్ సీఐ ప్రశాంత్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప తో పాటు 25 మంది సబ్ ఇన్స్పెక్టర్ లు  సిబ్బందితో కలిసి అనుమానాస్పద స్థలాలు, ఇళ్లను పరిశీలించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, అనుమానాస్పద కదలికలు ఉన్న ప్రాంతాలను పోలీసులు చెక్ చేశారు.

అనుమానాస్పద వ్యక్తుల ఐడీలు, అద్దె గదుల ధృవీకరణ పత్రాలు, మరియు నేరాల్లో ఉపయోగించే అవకాశమున్న వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలకు భద్రతా అవగాహన కల్పిస్తూ, పోలీసులతో సహకరించాల్సిన అవసరాన్ని అధికారులు పేర్కొన్నారు.   

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ పవన్ కళ్యాణ్ గారి దార్శనికతను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం నరేంద్ర దండి
ఆత్మీయ మిత్రుడు ఎర్రంశెట్టి మస్తాన్ రాయల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు విజయవాడ అమరావతి కన్వెన్షన్ లో...
By Benguluri Madhubabu 2026-06-28 12:26:58 0 108
Madhya Pradesh
Morena Solar Park: New 220 MW Green Energy Deal Signed
Ceigall India has officially signed a significant deal to develop a 220 MW solar and battery...
By Lokeshwari Panthadi 2026-07-01 06:53:41 0 54
Telangana
ఏజెన్సీలో వెలుగులు చిమ్మిన గంగారం కేజీబీవీ విద్యార్థిని సువిష్ణ
మహబూబాబాద్, ఏప్రిల్ 29: వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతమైన గంగారం మండలంలో, కేజీబీవీ (KGBV) పాఠశాల...
By Bheeshman King 2026-04-29 11:59:22 0 2K
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాజంపేట పార్లమెంటు పరిధిలోని తంబళ్లపల్లె నియోజకవర్గం 26.62 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన...
By Benguluri Madhubabu 2026-02-27 11:57:11 0 199
Andhra Pradesh
Megha Engineering: అమరావతిలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం.. ఈసారి మేఘా కంపెనీ పైపులు దగ్ధం.
      Megha Engineering: అమరావతిలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం.. ఈసారి మేఘా కంపెనీ...
By Pagadala Venkateswar 2026-03-24 03:48:46 0 282
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com