తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

0
379

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాల నుండి పెద్ద ఎత్తున యువత తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరుపేద ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం వంటి అంశాలను కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ప్రజల పక్షాన నిలబడి రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.తెలంగాణలోని బహుజన ప్రజలంతా పార్టీకి అండగా నిలుస్తున్నారని, ఈరోజు పార్టీలో చేరిన ప్రతి యువకుడు మరో 100 మందిని ప్రభావితం చేస్తూ భూపాలపల్లిలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. పార్టీ విధి విధానాలకు కట్టుబడి, పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీసి పేద ప్రజల కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పుప్పాల శ్రీను, దాసరపు వంశీ, దాసరపు శ్రావణ్, కొలనీ రమేష్‌లను రవి పటేల్ అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పిట్టల వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, కొత్త మహేష్‌తో పాటు పార్టీ గ్రామ కమిటీ కార్యకర్తలు, నాయకులు మరియు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి పరామర్శించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి..!!
చీరాల: ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి వర్యులు కాపు నేత అంబటి రాంబాబు...
By Gadiyapudi Narendra 2026-02-20 16:29:01 0 273
SURAKSHA
G. Veerapandian, IAS: Championing Excellence in Public Administration
A Distinguished Civil Servant Driving Good Governance, Administrative Reforms, and...
By Lokeshwari Panthadi 2026-07-11 08:57:54 0 138
Andhra Pradesh
ఆయుష్ శాఖ లో ఉద్యోగిని పదవి విరమణ
   విశాఖ పట్నం  జిల్లా  ఆనంద పురం మండలం శొంఠి యం  ఆయుష్  ఆసుపత్రి...
By Mobbu Venkatramana 2026-02-28 07:11:55 0 265
Andhra Pradesh
ఇంద్రకీలాద్రి మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేసినేని శివనాథ్ జానకి లక్ష్మి
*ప్రచారుణార్ధం * *07.03.2026*    *ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న...
By Rajini Kumari 2026-03-07 11:51:03 0 170
Business & Finance
Monsoon Mining Ban Begins in Udham Singh Nagar
The Udham Singh Nagar administration has imposed a ban on mining and riverbed material collection...
By Navya Sree 2026-07-01 06:37:16 0 43
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com