మెడికవర్ ఆసుపత్రిలో ప్యాంక్రియాటిక్ క్లినిక్ ప్రారంభం.|

0
159

సికింద్రాబాద్ : తెలంగాణలో యుక్త వయసులో ఉన్నవారికి ఇటీవల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో మెడికవర్ ఆసుపత్రిలో ప్రత్యేక ప్యాంక్రియాటిక్ క్లినిక్ ప్రారంభించినట్లు వైద్యులు తెలిపారు.

తెలంగాణ లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ఆదిలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే నివారణ సులభద్రమవుతుందని అన్నారు. ఈ వ్యాధి ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనబడకపోవడం మూలంగా సమస్యను తీవ్రతరం చేస్తున్నట్లు వెల్లడించారు.

మెడి కవర్ వైద్యుల పరిశీలనలో ఈ వ్యాధి లక్షణాలు, ప్రారంభ దశ గురించి అధ్యయనం చేసినట్లు తెలిపారు. సాధారణంగా కడుపునొప్పి బరువు తగ్గడం జీర్ణ సమస్యల లాంటి లక్షణాలతో ఈ వ్యాధి ప్రారంభమై తీవ్ర స్థాయికి చేరుకుంటుందని అన్నారు. ప్రతి ఏటా భారత్ లో సుమారు 15 వేల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు.

ఆధునిక జీవనశైలి అనారోగ్యకత ఆహారం ఊబకాయం ధూమపానం మద్యపానం చెక్కర వ్యాధి ప్రధాన కారకాలుగా నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల రెండు నెలల్లో మెడికవర్ వైద్య బృందం క్లిష్టమైన ప్యాంక్రియాటిక్ శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించి సత్ఫలితాలను సాధించినట్లు వెల్లడించారు. 

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవగాహన నెలను పురస్కరించుకొని మెడికవర్ ఆసుపత్రి వాక్ ధాన్, ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు యువ వైద్యుల కోసం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Sidhumaroju        

Search
Categories
Read More
Andhra Pradesh
మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో బాధ్యతలు
బొబ్బిలి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో రామ్మోహనరావు శనివారం బాధ్యతలు...
By Boiena Rajesh 2026-03-21 05:46:50 0 113
Telangana
రోడ్డులు తవ్వి వదిలేసిన అధికారులు
Old city Rashapuram colony lo GHMC Adikarulu Abhivudi panulo bhagamga roads thavaru dinitho atuga...
By Poloju Bhaskar 2026-03-09 04:20:18 0 138
Telangana
నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరితే చర్యలు తప్పవు - సిపి. సజ్జనార్.IPS.|
హైదరాబాద్ :  నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు...
By Sidhu Maroju 2025-12-24 05:14:26 0 194
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com