జనావాసాల మధ్య మద్యం దుకాణాలు: నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ.|

0
247

సికింద్రాబాద్ : జనావాస ప్రాంతాలలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ బేగంపేట హార్మోని అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. బేగంపేట గురుమూర్తి కాలనీ సమీపంలో గత నాలుగు సంవత్సరాలుగా మద్యం దుకాణం నడుస్తుండడం మూలంగా కాలనీవాసులు, విద్యార్థులు,మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఇటీవల మద్యం టెండర్లు పూర్తవగా వచ్చే నెల నుండి నూతన దుకాణాలు ప్రారంభం కానున్న తరుణంలో కాలనీ సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళల్లో మద్యం సేవించిన మత్తులో మందుబాబులు కాలనీకి చెందిన విద్యార్థినిలు,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. కాలనీ లోపలికి రావాలంటే భయాందోళనకు గురికావాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే నిర్లక్ష్యాలకు సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని మద్యం దుకాణాన్ని వేరొక చోటికి తరలించేంతవరకు పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు.

#sidhumaroju   

Search
Categories
Read More
Andhra Pradesh
దర్శి మండలం, రాజంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను అధికారులతో కలిసి పంపిణీ చేసిన దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు
దర్శి మండలం, రాజంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Chennaiah Kati 2026-02-07 10:44:10 0 220
Andhra Pradesh
ఘనంగా భారత్ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు !!
కర్నూలు సిటీ :  జిల్లా పోలీసు కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు... జాతీయ...
By Hari Krishna 2026-01-26 08:17:24 0 520
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:31:06 0 37
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ: గుండెపోటుతో తండ్రి మృతి అనాధలైన.
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, పెద్ద కొండ మర్రి గ్రామానికి చెందిన వై. శ్రీనివాసులు (38)...
By Kothuru Murali 2026-01-18 09:09:53 0 144
Andhra Pradesh
గ్లకోమా (నీటి చుక్కల వ్యాధి)పై అవగాహన సదస్సు.
మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో మంగళవారం 'జాతీయ గ్లకోమా వారోత్సవాలు' నిర్వహించారు. కంటిలో నీటి ఒత్తిడి...
By Pagadala Venkateswar 2026-03-10 08:49:21 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com