నల్లగుంట్ల గ్రామానికి రూ. 2 కోట్ల తారు రోడ్డు పనులకు శంకుస్థాపన- అభివృద్ధి దిశకు మరో ముందడుగు!

0
76

నల్లగుంట్ల గ్రామానికి రూ.2 కోట్ల తారు రోడ్డు పనులకు శంకుస్థాపన – అభివృద్ధి దిశగా మరో  ముందడుగు! 

దోర్నాల మండలం, కర్నూల్- గుంటూరు ప్రధాన రహదారి (KG రోడ్డు) నుండి నల్లగుంట్ల గ్రామానికి 3.4 కిలోమీటర్ల మేర రూ.2 కోట్ల నిధులతో తారు రోడ్డు నిర్మాణ పనులకు యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు గారు మాట్లాడుతూ -

టీడీపీ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, రహదారులు, తాగునీరు, విద్యుత్, విద్యా సదుపాయాల విస్తరణపై దృష్టి సారించిందని తెలిపారు. నల్లగుంట్ల గ్రామానికి అవసరమైన అంతర్గత రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి సదుపాయాల కోసం కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో దోర్నాల మండలం టీడీపీ అధ్యక్షులు షేక్ మాబు గారు, సొసైటీ చైర్మన్ బట్టు సుధాకర్ రెడ్డి గారు, లీగల్ సెల్ అధ్యక్షులు వల్లభనేని కాశయ్య గారు, మండల కూటమి నాయకులు, నల్లగుంట్ల గ్రామ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి !!
కర్నూలు : జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి...
By Hari Krishna 2025-12-26 16:36:11 0 116
Telangana
దస్తూరాబాద్: పోలింగ్ కేంద్రాల సందర్శన
దస్తూరాబాద్ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను తహశీల్దార్ కానక యాదరావు మంగళవారం సందర్శించారు. ఈ...
By Mitappaly Shiavji 2026-01-06 10:10:00 0 154
Andhra Pradesh
పిజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం వద్దు: ఎస్పీ
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-20 06:15:49 0 61
Andhra Pradesh
ఆదోని నీ జిల్లాగా ప్రకటించాలని పాదయాత్ర::
కర్నూలు : కర్నూలు జిల్లా : ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం మహా పాదయాత్ర...
By Hari Krishna 2026-01-04 10:50:32 0 97
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com