నార్త్ జోన్ పరిధిలో చోరీ ఐన 111 సెల్ ఫోన్ లు రికవరీ: బాధితులకు అందజేసిన డీసీపీ రష్మీ పెరుమాళ్

0
180

సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకోవడంతోపాటు చోరీకి గురైన కేసులలో పోలీసులు సిఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందచేశారు. ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ ఫిర్యాదుదారులకు సెల్ ఫోన్లను అందించారు. ఉత్తర మండల పరిధిలోని 11 పోలీస్ స్టేషన్లలో చోరీ అయిన 111 సెల్ ఫోన్లను ఫిర్యాదుదారులకు తిరిగి అందజేసినట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో సెల్ ఫోన్ దొంగతనాలు పెరిగిన నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సిఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ఫోన్లను గుర్తించే వెసులుబాటు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ల లో అత్యంత కీలకమైన సమాచారం సంక్షిప్తమై ఉంటున్న తరుణంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లను జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగతనానికి గురైతే ఆందోళన చెందకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ ఫోన్ కనిపెట్టవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పోర్టల్ గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 

#Sidhumaroju

 

Search
Categories
Read More
Andhra Pradesh
పంటలను ధ్వంసం చేస్తున్న ఒంటరి ఏనుగు
పులిచెర్ల మండలం దేవళంపేట పంచాయతీ దిగుమూర్తివారి పల్లి వద్ద ఆదివారం వేకువజామున ఒక ఒంటరి ఏనుగు...
By Kothuru Murali 2026-01-11 13:15:56 0 103
Andhra Pradesh
Passbooks: ఏపీ రైతులకు శుభవార్త.. జనవరి 2న వీటిని ఉచితంగా తీసుకోండి!
ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో రైతులకు శుభవార్త చెబుతోంది. ఐతే.. దీని వల్ల రైతులకు కొత్తగా కలిగే...
By Siva Bhaskar 2025-12-27 03:57:17 0 362
Telangana
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని.
హైదరాబాద్ జిల్లా/ సికింద్రాబాద్ : మానవాళికి భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు ధర్మ మార్గాన్ని...
By Sidhu Maroju 2025-08-16 09:09:02 0 600
Andhra Pradesh
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్ని కోటేశ్వరరావును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
గత కొన్ని రోజులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్ని కోటేశ్వరావు గారు అనారోగ్యంతో...
By Rajini Kumari 2026-01-25 11:08:53 0 127
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com