అద్దెకు తీసుకున్న కార్లను అమ్మేశాడు : తూర్పు మండల డీసీపీ బాలస్వామి

0
246

సికింద్రాబాద్: యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరినీ చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తూర్పు మండల డిసిపి బాల స్వామి తెలిపారు. నిందితుల నుండి ఏడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర్ బస్తీకి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి శ్రీ లక్ష్మీ లాజిస్టిక్స్ కంపెనీలో డ్రైవర్ గా విధులు నిర్వహించేవాడని పోలీసులు పేర్కొన్నారు. కంపెనీ యజమాని గణేశ్వర్ వద్ద వాహనాలను అద్దెకు తీసుకొని నెలవారిగా డబ్బులు చెల్లించేవాడని అన్నారు. ఆరు నెలల పాటు వ్యాపారం సాఫీగానే సాగినప్పటికీ అనంతరం నెలవారీ డబ్బులు చెల్లించకపోగా వాహనాలను తిరిగి ఇవ్వాలని యజమాను కోరడంతో వాటిని విక్రయించినట్లు చెప్పాడు. వెంటనే గణేశ్వర్ చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేశారు. ప్రవీణ్ తన స్నేహితులైన రిజ్వాన్, అమరేందర్ లకు వాహనాలను విక్రయించినట్లు పోలీసులకు విచారణలో  తేలడంతో వారిని సైతం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ములకలచెరువు: ఈ నెంబర్ సేవ్ చేసుకోండి
ములకలచెరువు MPDO హరినారాయణ శుక్రవారం బురకాయలకోటలో ప్రభుత్వ వాట్సప్ సేవల వినియోగంపై అవగాహన...
By Pagadala Venkateswar 2026-01-31 08:01:08 0 127
Andhra Pradesh
సాకారమైన సొంతింటి కల – మదనపల్లిలో ఘనంగా గృహప్రవేశాలు.
మదనపల్లి మండలం కోళ్ల బైలు పంచాయతీ హౌసింగ్ లేఅవుట్‌లో సోమవారం గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా...
By Pagadala Venkateswar 2026-03-31 03:30:10 0 117
Telangana
హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ మొదటి వార్షికోత్సవ వేడుకలు.|
మేడ్చల్   మల్కాజిగిరి జిల్లా :  ప్రముఖ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ 'జావేద్ హబీబ్'...
By Sidhu Maroju 2026-02-19 10:15:38 0 189
Gujarat
Strengthening the Roots: ₹330 Crore Boost for Education
The Gujarat Education Department has officially sanctioned ₹330 crore to overhaul school...
By Dunna Jessicaruth 2026-05-15 04:55:13 0 39
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com