అల్వాల్ రెడ్డి సంఘం అభివృద్ధికి ఎమ్మెల్యే చేయూత.

0
169

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   అల్వాల్ సర్కిల్‌లోని తోట పెంటా రెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన రెడ్డి జన సంఘం సమ్మేళనంలో మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మచ్చ బొల్లారంలో రెడ్డి కుల సంఘ భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించారు. రెడ్డి సామాజిక వర్గం ఐక్యంగా ముందుకు సాగాలనే సంకల్పంతో సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ, భవిష్యత్‌ లో మరింత అభివృద్ధి దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ రెడ్డి భవనం పేద ప్రజలకు ఎల్లవేళల ఉపయోగపడే విధంగా ఉండాలని ఆకాంక్షించారు కుల సంఘ ఐక్యతను ప్రతిబింబించే ఈ సమ్మేళనం, భవిష్యత్‌లో సామాజిక శ్రేయస్సు కోసం మరిన్ని కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జన సంఘ సభ్యులు గుమ్మడి ఆనంద్ రెడ్డి, కౌకుంట్ల శ్రీధర్ రెడ్డి,తోట దేస్వంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ,చింతల మాణిక్య రెడ్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో 10 కోట్లు జమ
సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో రూ.10,000 కోట్లకు పైగా జమ స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్‌కు...
By Rajini Kumari 2026-01-14 12:35:49 0 82
Andhra Pradesh
PDS బియ్యం అక్రమంగా తరలిస్తున్న రేండు వాహనాలు స్వాధీనం, 6 టన్నుల PDS బియ్యం పట్టివేత.
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ...
By John Baji 2026-01-12 14:17:57 0 89
Telangana
మారకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.
సికింద్రాబాద్.. నగరంలోని పలు ప్రాంతాలలో అక్రమంగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను ఉత్తర మండల...
By Sidhu Maroju 2025-06-18 13:22:23 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com