పెండింగ్ బిల్లులను మంజూరు చేయండి :- దౌల మండల కో ఆప్షన్ సభ్యులు

0
272

మండల కో ఆప్షన్ సభ్యులు దౌల సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఓ ఆర్ డి మధులతకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని అర్జీని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో గడప గడపకు మన ప్రభుత్వం కింద ఒక్కో సచివాలయానికి అభివృద్ధి పనులు కొరకు ప్రభుత్వంరూ.20 లక్షలలు మంజూరు చేసిందన్నారు. స్థానిక ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనులు చేసేందుకు అప్పటి ఎంపీడీవో సమక్షంలో పంచాయతీరాజ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లు పనుల అగ్రిమెంట్ను తనతో చేయించుకోవడంతో రూ 20 లక్షలు అప్పులు తెచ్చి మూడు కిలోమీటర్ల మేరకు కొత్త తాగునీటికి పైప్లైన్, 12కి పైగా కాలనీలో మినీ ట్యాంకులు, బోర్లకు విద్యుత్ మోటర్లు వంటి వాటి ఏర్పాటుకు ఖర్చు చేయడం జరిగిందన్నారు. కాలనీలో పనులు పూర్తయి మూడేళ్లు అవుతున్న ఇప్పటివరకు కేవలం అధికారులు నాలుగు లక్షల వరకు బిల్లులు మంజూరు చేయగా మిగిలిన రూ 16 లక్షల బిల్లులు చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారన్నారు. పనులకు సంబంధించిన ఏం బుక్, వర్క్ అగ్రిమెంట్లు, పనికి సంబంధించిన ఎస్టిమేషన్ కాపీలను అందించకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎంపీడీవో స్పందించి తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని ఆయన కోరారు. .

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఆ రోజు త్వరలోనే వస్తుంది: ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు.
గూగుల్ రాకతో విశాఖ ఏఐ డేటా హబ్‌గా ఎదుగుతుందని వెల్లడి క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు తయారు...
By Pagadala Venkateswar 2026-02-20 11:38:17 0 217
Andhra Pradesh
విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు.
ఏపీలో 51 మంది ప్రభుత్వ వైద్యులను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా...
By Pagadala Venkateswar 2026-05-07 07:06:47 0 60
Andhra Pradesh
ద్రాక్షారామంలో కాళేశ్వర స్వామి శివలింగం ద్వమ్సాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం
దాక్షారామం లో కాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసానికి వ్యతిరేకిస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో హిందూ...
By Rajini Kumari 2026-01-10 13:14:30 0 148
Andhra Pradesh
మాలినేని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 'సంస్కృతి-2026' వైభవం * ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఎన్.సి.సి విద్యార్థుల ఘనస్వాగతం
మాలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 'సంస్కృతి 2026' వార్షికోత్సవ వేడుకలు ఘనంగా...
By Vadlamudi NagaVenkat 2026-03-13 15:27:27 0 869
Andhra Pradesh
మంగళగిరిలో గాయత్రి బ్యాంక్ ప్రారంభోత్సవం చిల్లపల్లి శ్రీనివాసరావు
*మంగళగిరిలో గాయత్రి బ్యాంక్ బ్రాంచ్ శుభారంభం*   *-తెలుగురాష్ట్రాల్లో విస్తరిస్తున్న...
By Rajini Kumari 2026-01-28 12:58:58 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com