రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

0
282

సికింద్రాబాద్ :  పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రసూల్ పురా నారాయణ జోపూడి లో నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కర్ణన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తూ గత ప్రభుత్వం వదిలేసిన రెండు పడక గదులను సైతం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. 288 మంది కుటుంబాలకు పట్టాలు అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. కంటోన్మెంట్ లోని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే పేదలకు ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు పేదలకు ఇల్లు నిర్మించి మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కంటోన్మెంట్ ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్లో గాంధీ భవన్లో సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశం లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ
హైదరాబాద్‌ గాంధీ భవన్ లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశంలో పెద్దపల్లి...
By Avunoori Mahesh 2026-04-27 10:18:01 0 177
Telangana
వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్న సూడో పోలీస్ : అరెస్ట్ చేసిన పోలీసులు.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి పిఎస్ పరిధిలో నకిలీ పోలీసుగా చలామణి అవుతూ వాహనదారుల నుండి డబ్బులు...
By Sidhu Maroju 2025-11-01 18:24:18 0 249
Andhra Pradesh
తపాలా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ పథకం కింద నగదు ప్రోత్సాహం
నందిగామ ఎన్టీఆర్ జిల్లా 2025 సంవత్సరమునకు గాను తపాలా శాఖ వారు నిర్వహించినటువంటి దీన్ దయాల్...
By Patan Khuddus 2026-04-17 15:39:01 0 348
Telangana
వి.ఎస్.ఎన్. మూర్తి (దేవిప్రియ) సస్పెండ్ .|
హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ (TFJA) కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్...
By Sidhu Maroju 2026-03-04 19:28:56 0 171
Telangana
నిజామాబాద్: ఏప్రిల్ 25 కొత్తపార్టీ ప్రకటన
ఏప్రిల్ 25వ  తేధిన తాన పార్టిని ప్రకటిన్‌చానున్నట్లు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే, జాగృతి...
By Sadaq Sadaq 2026-03-27 13:54:21 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com