అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శ్రీ మఠం పీఠాధిపతి!!

0
207

కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ధార్మిక పర్యటనలో భాగంగా కేరళ రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చేరుకున్న పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు పీఠాధిపతిని ఘనంగా సత్కరించారు. అనంతరం కేరళ రాజభవన్ కు చేరుకున్న పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులకు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గవర్నర్‌కు రాఘవేంద్ర స్వామి మఠం తరపున శేష వస్త్రం, జ్ఞాపిక , పలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. ఆయన వెంట శ్రీమఠం ప్రత్యేక అధికారి కృష్ణ కౌశిక్ ఆచార్, రాజా అప్రమేయ ఆచార్, వేద పండితులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి
గ్రామాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం పిరిడిలో...
By Boiena Rajesh 2026-04-01 23:51:49 0 82
Andhra Pradesh
కర్నూలు జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ ::
కర్నూలు:  కర్నూలులో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలురోడ్డు ప్రమాదాల నివారణకు...
By Hari Krishna 2025-12-24 14:56:03 0 576
Andhra Pradesh
Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-03-20 14:05:57 0 97
Andhra Pradesh
నిమ్మనపల్లి: ఆస్తి ఇవ్వలేదని తల్లిదండ్రులపై కుమారుడి దాడి.
నిమ్మనపల్లి మండలంలో గురువారం సాయంత్రం ఆస్తి రాసివ్వలేదన్న కారణంతో తల్లిదండ్రులపై కుమారుడు దాడి...
By Pagadala Venkateswar 2026-01-23 07:36:56 0 118
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com