అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శ్రీ మఠం పీఠాధిపతి!!

0
264

కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ధార్మిక పర్యటనలో భాగంగా కేరళ రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చేరుకున్న పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు పీఠాధిపతిని ఘనంగా సత్కరించారు. అనంతరం కేరళ రాజభవన్ కు చేరుకున్న పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులకు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గవర్నర్‌కు రాఘవేంద్ర స్వామి మఠం తరపున శేష వస్త్రం, జ్ఞాపిక , పలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. ఆయన వెంట శ్రీమఠం ప్రత్యేక అధికారి కృష్ణ కౌశిక్ ఆచార్, రాజా అప్రమేయ ఆచార్, వేద పండితులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి - ASP.
అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వెంకటాద్రి, మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్...
By Pagadala Venkateswar 2026-03-04 11:41:22 0 148
Andhra Pradesh
పుంగనూరు: టెంపో - బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
శనివారం రాత్రి పుంగనూరు మండలం ఉలవలదిన్నె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి...
By Kothuru Murali 2026-03-02 04:01:26 0 210
Andhra Pradesh
మదనపల్లె అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి: సీపీఐ.
జూన్ 20న సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటన సందర్భంగా, సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళి సోమవారం...
By Pagadala Venkateswar 2026-06-16 04:16:46 0 48
Andhra Pradesh
Mohan Babu: మోహన్ బాబు, మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదు.
ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ కిడ్నాప్ కిడ్నాపర్లను గంటన్నరలో...
By Pagadala Venkateswar 2026-02-04 07:34:06 0 159
Andhra Pradesh
టిడిపి సీనియర్ కార్యకర్త నాగరాజుకు నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ఉదయం టిడిపి సీనియర్ కార్యకర్త తరుగు నాగరాజు మృతి విషయం తెలుసుకుని మాసాపేట నందు వారి...
By Benguluri Madhubabu 2026-02-07 04:02:39 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com