సెంట్రింగ్ బాక్సుల దొంగల అరెస్టు - మీడియా ముందు ప్రవేశపెట్టిన అల్వాల్ పోలీసులు

0
247

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్.    రాత్రి వేళల్లో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్ సామగ్రిని అపహరిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పేట్ బషీర్ బాద్ ఏసిపి బాలగంగి రెడ్డి తెలిపారు.నిందితుల నుండి 3 లక్షల విలువైన సెంట్రింగ్ సామగ్రి తో పాటు నాలుగు సెల్ ఫోన్లు ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో ఒక మైనర్ తో కలిపి 5 మందిని అరెస్టు చేసిన అల్వాల్ పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు. జూబ్లీహిల్స్ కు చెందిన గోపాల్ అనే వ్యక్తి జిహెచ్ఎంసి లో చెత్త సేకరించే ఆటో నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గోపాల్ కొడుకు సుధీర్ తో పాటు అదే ప్రాంతానికి చెందిన చైతన్య, లక్ష్మణ్, వరుణ్ లు యూసఫ్ గుడా ప్రాంతంలో స్క్రాప్ దొంగతనాలు చేసేవారిని ఎసిపి వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి భవన నిర్మాణాల వద్ద ఉన్న సెంట్రింగ్ సామాగ్రిని అపహరించేందుకు ప్రణాళిక వేసినట్లు తెలిపారు. అల్వాల్ ప్రాంతంలో జిహెచ్ఎంసి చెత్త తరలించే వాహనాన్ని ఉపయోగించి సెంట్రింగ్ సామాగ్రిని అపహరించారు. దొంగలించిన సొమ్మును ముషీరాబాద్ లో జహీరుద్దీన్ అనే స్క్రాప్ వ్యాపారికి అమ్మినట్లు విచారణలో వెల్లడైంది.జూబ్లీహిల్స్ కు చెందిన చెత్త తరలించే వాహనం అల్వాల్ లో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీయగా సెంట్రింగ్ సామాగ్రి అపహరించే ముఠాగా తేటతెల్లమైంది.  సెంట్రింగ్ సామాగ్రిని అమ్మిన అనంతరం వచ్చిన డబ్బుతో నిందితులు జల్సాలు చేసుకునే వారిని పోలీసులు తెలిపారు.

  SIDHUMAROJU 

Search
Categories
Read More
Andhra Pradesh
JKSA: కర్నూలు నర్సింగ్ కాలేజీలో కశ్మీరీ విద్యార్థినులపై వేధింపులు.. సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు.
సీఎం చంద్రబాబు జోక్యం కోరుతూ జేకే స్టూడెంట్స్ అసోసియేషన్ లేఖ రంజాన్ ఏర్పాట్లు, హిజాబ్‌పై...
By Pagadala Venkateswar 2026-02-27 10:44:12 0 81
Andhra Pradesh
మదనపల్లి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు
మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాజంపేట పార్లమెంటు...
By Benguluri Madhubabu 2026-02-01 11:58:05 0 186
Andhra Pradesh
క్రీస్తు సూక్తులు అనుసరించాలి ఎంపీ కేశినేని శివనాదం
*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*   శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం చాటే క్రీస్తు...
By Rajini Kumari 2025-12-22 08:13:08 0 174
Andhra Pradesh
నేడు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిస్కార వేదిక (PGRS) అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పి జి ఆర్ ఎస్ కు హాజరు కావాలి
బాపట్ల: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పి జి ఆర్ ఎస్...
By Gadiyapudi Narendra 2026-02-02 13:31:08 0 137
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com