యువత క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది : బండారు కార్తీక రెడ్డి.

0
229

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : లాలాపేట్ :   తెలంగాణ ఓపెన్ చిల్డ్రన్స్ చెస్ టోర్ననెట్ 2025 గ్రాడ్ ఫైనల్ కి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి  పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లాలాపేట్ లోని కార్తీక గ్రాండ్స్ ఫంక్షన్ హాల్ జరిగింది. ఈ కార్య క్రమంలో 360 విద్యార్థులు పాల్గొన్నారు. గెలిచిన వాళ్లకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లో బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి  మాట్లాడుతూ... క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను మరింత చాటుకుకోవాలి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేసింది అన్నారు. యువత క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఒకవైపు క్రీడా అసోసియేషన్స్ సైతం టోర్నమెంట్లు నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నాయి. చదరంగం ఆట అంటే విజ్ఞానం, పరిజ్ఞానం, వ్యూహాత్మకత, కళా నైపుణ్యం కలిసి ఉంటాయి. ఈ ఆట ఆడడం ద్వారా మేధాశక్తితో పాటు ఏకాగ్రత పెరుగుందుదన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీఎ సెక్రటరీ జయచంద్ర, నిషా విద్యార్థి అసిటెంట్ డైరెక్టర్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆర్గనైజర్ శ్రీరామ్, చంద్రమౌళి, సంజయ్, బిజెపి నాయకులు వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
Satya Kumar Yadav: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ.
Satya Kumar Yadav: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత ప్రాజెక్టు ప్రారంభం: సత్యకుమార్ యాదవ్...
By Pagadala Venkateswar 2026-03-09 06:06:41 0 73
Kerala
Kerala’s Greenfield Highway & NH Upgrade Projects Now in Limbo
Two major infrastructure plans—the Kozhikode–Mysore greenfield corridor and the...
By Bharat Aawaz 2025-07-17 08:34:09 0 2K
Andhra Pradesh
టీటీడీ చైర్మన్ వ్యవహార శైలిపై నిరసన
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి...
By Rajini Kumari 2026-04-04 15:33:23 0 115
Andhra Pradesh
మదనపల్లిలో విషాదం: ఆపరేషన్ వికటించి తల్లి, బిడ్డ మృతి.
మదనపల్లిలోని సన్ షైన్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన 33 ఏళ్ల గాయత్రి ఆపరేషన్ వికటించి మృతి...
By Pagadala Venkateswar 2026-03-08 06:49:23 0 91
Andhra Pradesh
అనుచిత పోస్టులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదు.
మదనపల్లికి చెందిన కార్ల వ్యాపారి ఖాదరవల్లి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్వాతంత్ర్య సమరయోధుడు వీర...
By Pagadala Venkateswar 2026-03-31 03:32:22 0 63
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com