అల్వాల్ ముంపు కష్టాలకు చెక్ : రూ. 2.3 కోట్లతో బాక్స్ డ్రెయిన్ పనులకు శ్రీకారం. |

0
119

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజల వరద కష్టాలను తీర్చేందుకు ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. వెస్ట్ వెంకటాపురం దినకర్ నగర్ లోని చినరాయుడు చెరువు సమీపంలో రూ. 2.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాక్స్ డ్రెయిన్ పనులకు కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వర్షపు నీటి నిల్వ సమస్యకు బాక్స్ డ్రెయిన్ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును మంజూరు చేయించామని కాలనీల నివాసితులు ముంపు భయం లేకుండా ఉండవచ్చని తెలిపారు.

 

మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా అల్వాల్ సర్కిల్ వ్యాప్తంగా దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. పనుల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదని అధికారుల పర్యవేక్షణలో నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని ఆయన స్పష్టం చేశారు. 

 

ఈ కార్యక్రమంలో... సర్కిల్ డి.ఈ ప్రశాంతి, ఏ.ఈ అరుణ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ప్రతినిధులు మరియు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పిన్నెల్లి సోదరులు నరహంతకులు రాష్ట్ర ప్రజలు వారి అరెస్టు స్వాగతిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
*ప్ర‌చుర‌ణార్థం* 14-12-2025*     పిన్నెల్లి సోద‌రులు...
By Rajini Kumari 2025-12-15 07:47:09 0 210
Andhra Pradesh
పట్టణ శివారులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని...
By Ratna Sekhar 2026-03-06 16:48:03 0 387
Andhra Pradesh
ఆర్టీసీ చార్జీలు పెంచభూమన్న మంత్రి మండి పల్లి
AP: ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం...
By Pagadala Venkateswar 2026-01-13 07:38:02 0 117
Andhra Pradesh
గుంటూరు జిల్లాలో 25% మేర తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై నియంత్రణకు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. 2025 సంవత్సరంలో...
By John Baji 2025-12-30 12:05:33 0 182
Telangana
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాజాసింగ్ లేఖ : తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు. |
  హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యవసర లేఖ...
By Sidhu Maroju 2026-03-21 15:14:42 0 112
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com