కాలనీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
211

సికింద్రాబాద్ :   కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం వార్డు 7 పరిధిలోని IOB కాలనీ,రవి కాలనీ, బంజారా కాలనీలను కాలనీ వాసులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలవాసులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. ముఖ్యంగా అంతర్గత రహదారులు వేయాలని, ఖాళీగా ఉన్న పార్క్ స్థలాన్ని అభివృద్ధి చేసి అందులో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే కాలనీల వాసులకు ప్రయోజనం ఉంటుందని కాలనీల వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.కాలనీలలో ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పారు. అన్ని కాలనీలను కలియతిరిగిన ఎమ్మెల్యే వారితో మాట్లాడుతూ మీ సమస్యలను పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటానని, కాలనీల వాసులు కూడా కలసికట్టుగా తమకేం కావాలో కూర్చుని చర్చించుకుని నా దృష్టికి తీసుకువస్తే, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ ని కూడా కాలనీలకి పిలిపించి ఇరువురము కలిసి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, నన్ను ఆశీర్వదించి గెలిపించిన మీకు సేవ చేయడమే భాగ్యంగా భావిస్తానని చెప్పారు. ఈ కాలనీలో పరిశీలనలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి నాగినేని సరిత, మరియు కాలనీలవాసులు పాల్గొన్నారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
లోయోలా అకాడమీలో ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు.|
    సికింద్రాబాద్ : తెలంగాణ – లోయోలా అకాడమీ 1976లో స్థాపించబడి, శ్రేష్ఠత,...
By Sidhu Maroju 2025-12-20 10:11:54 0 117
Haryana
Hisar Schools Closed in Protest After Principal’s Tragic Murder
On July 17, private schools across Hisar observed a shutdown in response to the shocking murder...
By Bharat Aawaz 2025-07-17 06:27:47 0 1K
Telangana
రోడ్డుమీద చెత్త వేస్తున్నారా.. అయితే 8 రోజుల జైలు శిక్ష ఖాయం.
   హైదరాబాద్:    సెక్షన్ 70(బీ), 66 సీపీ యాక్ట్ కింద.. రోడ్డుపై చెత్త...
By Sidhu Maroju 2025-09-14 11:55:42 0 184
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : 9 మంది పేకాట రాయుళ్లపై కేసు నమోదు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది జూదరులను ఎస్సై...
By Kothuru Murali 2026-02-15 07:14:38 0 17
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com