అందుబాటులోకి హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ "1070"

0
333

 

 

 హైదరాబాద్:   హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు స్వీక‌రించ‌డానికి టోల్‌ఫ్రీ నంబ‌రు 1070 అందుబాటులోకి వ‌చ్చింది. 1070 నంబ‌రుకు ఫోను చేసి ఫిర్యాదులు చేయ‌వ‌చ్చున‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్  ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌బ్జాకు గురైతే వెంట‌నే టోల్‌ఫ్రీ ద్వారా స‌మాచారాన్ని అందించ‌వ‌చ్చున‌ని తెలిపారు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు.. చెట్లు ప‌డిపోయినా, వ‌ర‌ద ముంచెత్తినా, అగ్ని ప్ర‌మాదాలు జ‌రిగినా ఇలా ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితులున్న‌ప్పుడు హైడ్రాకు సంబంధించిన సేవ‌ల‌న్నిటికోసం టోల్ ఫ్రీ నంబ‌రు 1070 ద్వారా సంప్ర‌దించ‌వ‌చ్చున‌ని పేర్కొన్నారు. 

అందుబాటులో సెల్ నంబ‌ర్లు కూడా...

ఓఆర్ఆర్ ప‌రిధిలో ప్ర‌భుత్వ, ప్ర‌జా ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు 8712406899 నంబ‌రుకు స‌మాచారం ఇవ్వ‌డంతో పాటు.. వాట్సాప్ ద్వారా ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంపించ‌వ‌చ్చున‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. దీనికి తోడు.. ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు, భారీ వ‌ర్షాలు ప‌డి కాల‌నీలు, ర‌హ‌దారులు నీట మునిగినా, అగ్ని ప్ర‌మాదం జ‌రిగినా వెంట‌నే 8712406901, 9000113667 ఈ రెండు నంబ‌ర్ల‌కు ఫోను చేయాల‌ని హైడ్రా కోరింది. 1070 టోల్ ఫ్రీ నంబ‌రుతో పాటు.. పైన పేర్కొన్న మూడు సెల్ నంబ‌ర్ల‌ను ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ సూచించారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ స్టేడియంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*కూటమి ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తుంది: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
By Rajini Kumari 2025-12-13 10:05:55 0 197
Andhra Pradesh
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలం గంటవాని పల్లె దగ్గర వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నసీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం   దోర్నాల మండలం గంటవాని పల్లె...
By Chennaiah Kati 2026-02-19 11:59:47 0 207
Andhra Pradesh
విజయవాడ గొల్లపూడి లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
గొల్లపూడి లో ఘనంగా టిడిపి 44 వసంతాల ఆవిర్భావ వేడుకలు    ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల...
By Rajini Kumari 2026-03-30 04:49:39 0 81
Andhra Pradesh
బస్సు ప్రమాదం ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చే సీన బిజెపి ఏపీ అధ్యక్షుడు పివీఎన్
అమరావతి   *బస్సు ప్రమాద ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బిజెపి ఎపి అధ్యక్షుడు పివియన్...
By Rajini Kumari 2025-12-12 17:15:44 0 210
Andhra Pradesh
ఎమ్మిగనూరులో ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో బివిజేనేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు
ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర @2047 – బడ్జెట్ 2026-27...
By Boya Dasthagiri 2026-04-04 14:08:43 0 128
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com