ఆన్ లైన్ మోసానికి బలైన అల్వాల్ సీనియర్ సిటిజన్

0
491

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని వెంకటాపురం డివిజన్‌కు చెందిన ఓ సీనియర్ సిటిజన్ ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.   ఫేస్‌బుక్‌లో “షుగర్ సెన్సెస్ ప్రో హై ప్రొసీజర్ మానిటరింగ్ డివైస్ – హాట్ డీల్, బై వన్ గెట్ వన్ ఫ్రీ” అనే ప్రకటన చూసి ఆర్డర్ పెట్టారు. ఆ ప్రకటనలో 80,000 మంది సంతృప్తి చెందిన కస్టమర్లు ఉన్నారని చెప్పడంతో నమ్మి ఆర్డర్ చేసిన సీనియర్ సిటిజన్, వచ్చిన కొరియర్ తెరవగానే షాక్‌కు గురయ్యారు. డివైస్ బదులుగా రెండు సబ్బు బిళ్లలు, పేపర్ ప్లేట్స్ కాయలు మాత్రమే పంపించారు.   ఈ ఘటనతో బాధితుడు తీవ్రంగా ఆందోళన చెందగా, ఇతరులు ఇలాంటి మోసపూరిత ఆన్‌లైన్ ప్రకటనలకు బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారులు కూడా ఇలాంటి మోసపూరిత ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

   - sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహన ర్యాలీ
భద్రత వారోత్సవాల్లో భాగంగా పుంగనూరు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో...
By Kothuru Murali 2026-01-13 09:19:10 0 125
Telangana
అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కాంగ్రేస్ కార్యకర్తకి స్థానిక ఎమ్మెల్యే పరామర్శించారు కసిరెడ్డి నారాయణరెడ్డి
ఈరోజు రంగా రెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామ వాస్తవ్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ...
By MERIGE MALLESH 2026-04-01 12:55:48 0 137
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com