ఆన్ లైన్ మోసానికి బలైన అల్వాల్ సీనియర్ సిటిజన్

0
385

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని వెంకటాపురం డివిజన్‌కు చెందిన ఓ సీనియర్ సిటిజన్ ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.   ఫేస్‌బుక్‌లో “షుగర్ సెన్సెస్ ప్రో హై ప్రొసీజర్ మానిటరింగ్ డివైస్ – హాట్ డీల్, బై వన్ గెట్ వన్ ఫ్రీ” అనే ప్రకటన చూసి ఆర్డర్ పెట్టారు. ఆ ప్రకటనలో 80,000 మంది సంతృప్తి చెందిన కస్టమర్లు ఉన్నారని చెప్పడంతో నమ్మి ఆర్డర్ చేసిన సీనియర్ సిటిజన్, వచ్చిన కొరియర్ తెరవగానే షాక్‌కు గురయ్యారు. డివైస్ బదులుగా రెండు సబ్బు బిళ్లలు, పేపర్ ప్లేట్స్ కాయలు మాత్రమే పంపించారు.   ఈ ఘటనతో బాధితుడు తీవ్రంగా ఆందోళన చెందగా, ఇతరులు ఇలాంటి మోసపూరిత ఆన్‌లైన్ ప్రకటనలకు బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారులు కూడా ఇలాంటి మోసపూరిత ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

   - sidhumaroju 

Search
Categories
Read More
Telangana
కొత్త రకం దొంగతనాలు :ముగ్గురిని కటకటాల్లోకి నెట్టిన బోయిన్ పల్లి పోలీస్ లు
సికింద్రాబాద్.. ద్విచక్ర వాహనంపై వెళ్తూ సొమ్మసిల్లి రహదారిపై కుప్పకూలినట్లు నటిస్తారు.వెంటనే...
By Sidhu Maroju 2025-06-17 10:46:20 0 1K
Telangana
భూ కబ్జాదారుడంటూ తనపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించిన మామిడి జనార్ధన్ రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని సర్వే నెంబర్ 573, 574 లో ఉన్న ఐదు ఎకరాల స్థల సరిహద్దు...
By Sidhu Maroju 2025-10-11 13:01:46 0 51
Business
వెండి నిలకడగా.. బంగారం ధరలు పెరిగిన రోజు |
హైదరాబాద్‌లో బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. 2025 అక్టోబర్ 24 నాటికి...
By Akhil Midde 2025-10-25 06:46:10 0 39
Andhra Pradesh
బ్రహ్మోత్సవాలలో పట్టువస్త్రాల సమర్పణ: చంద్రబాబు అరుదైన రికార్డు |
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి...
By Bhuvaneswari Shanaga 2025-09-26 11:05:24 0 48
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com