కార్మికుల హక్కుల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం – లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: ఆమ్ ఆద్మీ పార్టీ

0
220

కాకినాడ: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న లేబర్ కోడ్స్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, వాటిని తక్షణమే రద్దు చేసి కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా చట్టాలను సవరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజ సాంచి డిమాండ్ చేశారు. కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా ఏర్పడిన లేబర్ కౌన్సిల్, ట్రేడ్ యూనియన్ చట్టాల ద్వారా కార్మికులకు లభించిన హక్కులను హరించేలా లేబర్ కోడ్స్ ఉన్నాయని విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్ మాట్లాడుతూ, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువస్తున్న లేబర్ కోడ్స్ అశాస్త్రీయమైనవని అన్నారు. కార్మిక సమాజానికి నష్టం కలిగించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ పాల్గొన్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ ప్రాంతాల్లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించబడింది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు న్యాయవాదుల సంఘం బాధ్యతలు స్వీకరణ, న్యాయమూర్తుల నియామకంపై వినతి
అన్నమయ్య జిల్లా పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది విజయకుమార్, ప్రధాన...
By Kothuru Murali 2026-04-02 06:39:34 0 68
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ అభివృద్ధిపై కూటమి నేతల మధ్య పూర్తి సమన్వయం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ అభివృద్ధి పై ఎన్డీయే కూటమి నేతల మధ్య పూర్తి సమన్వయం ఉందని, మేయర్ కోవెలమూడి రవీంద్ర...
By John Baji 2025-12-30 01:14:44 0 136
Andhra Pradesh
గ్రామీణ ప్రాంతాల్లో "రీసర్వే "రైతులకు అవగాహన సదస్సు
తిరుపతి:-తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం గ్రామ పంచాయతీ కాలూరు రెవెన్యూ విలేజ్ పరిధిలోని ఉన్న...
By Karapati Gopi 2025-12-31 07:01:34 0 657
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com