మున్సిపాలిటీలు సమగ్రామాభివృద్దే ద్యేయం: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

0
602

 

 

 మెదక్ జిల్లా: మెదక్.  అన్ని వార్డులలో పౌర సౌకర్యాలు పెంపొందించి మోడల్ మున్సిపాలిటీగా రూపొందించాలి మున్సిపాలిటీ పరిధిలో వార్డులు వారీగా  తిరుగుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలపై తెలుసుకుంటున్న ఎమ్మెల్యే మైనంపల్లి.  మెదక్ మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. వార్డులు వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. మున్సిపాలిటీలో వార్డులు వారిగా ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను తెలుసుకోవడం జరిగిందని అన్నారు. అన్ని వార్డులలో పౌర సౌకర్యాలను పెంపొందించడం ద్వారా మోడల్ మునిసిపాలిటీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ఆ దిశగా ముందుకు పోతున్నామన్నారు. అన్ని వార్డులలో డ్రైనేజీ, సిసి రోడ్లు, తాగునీటి సౌకర్యాలు ఉండేలా చూడాలని ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   -sidhumaroju

Search
Categories
Read More
Maharashtra
Maharashtra Expands Healthcare and Medical Infrastructure
Maharashtra is strengthening its healthcare system through continued investment in medical...
By Fathima Safa 2026-06-30 11:23:13 0 75
SURAKSHA
WB Police Campaign for a Drug-Free West Bengal
Protecting the youth from the perils of substance abuse is a top priority for the West Bengal...
By Kalaga Sailaja 2026-06-27 07:53:53 0 72
Andhra Pradesh
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు దినాల్లో టీచర్లతో పని చేపించిన ఆదోని నారాయణ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
ఆదోని పట్టణంలో కార్పొరేట్ నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ సెలవు దినాల్లో కూడా...
By Boya Dasthagiri 2026-06-01 08:56:47 0 170
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:42:45 0 118
Andhra Pradesh
మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు మార్కాపురం నియోజకవర్గంలో వివిధ శుభకార్యాలలో పాల్గొన్నారు.
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు...
By Chennaiah Kati 2026-06-21 13:53:36 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com