అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ నాలా పనుల ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
574

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  బోయిన్ పల్లి వార్డు 6 అరవెల్లి ఎన్క్లేవ్, రాయల్ ఎన్క్లేవ్ కాలనీలలో 39 లక్షల రూపాయలతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ నాలా పనుల ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మద మల్లికార్జున్ తో పాటు కలిసి పాల్గొన్నారు.పనుల ప్రారంభోత్సవం అనంతరం కాలనీల వాసులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు.వారితో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితమని, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా సమకూరుతున్న 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో గతంలో కనీవినీ అభివృద్ధి జరుగబోతుందని,అందరం సమన్వయం చేసుకొని కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  -sidhumaroju

Search
Categories
Read More
Telangana
గ్యాస్ బ్లాక్ దందా బట్టబయలు.. 420 సిలిండర్లు స్వాధీనం.|
      హైదరాబాద్‌ : బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల దందాను టాస్క్ ఫోర్స్...
By Sidhu Maroju 2026-03-30 10:45:33 0 113
Andhra Pradesh
ఆగిరిపల్లి పోతవరప్పాడు లో పేకాట శిబిరంపై పోలీసుల ఆకస్మిక దాడులు
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులో పేకాట శిబిరంపై పోలీసుల ఆకస్మిక దాడులు...  ...
By Rajini Kumari 2025-12-22 08:08:29 2 930
Andhra Pradesh
న్యూ ఇయర్ వేళ ఏపీలోని మద్యం దుకాణాల పని వేళల్లో మార్పులు.
కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సిద్దమవుతున్నారు. ఇప్పటికే...
By John Baji 2025-12-30 05:17:55 0 156
Telangana
సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 - వీధి దీపాలు వెలగక తీవ్ర ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు.
సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 – వీధి దీపాల సమస్యతో ఇబ్బందులు   అల్వాల్ సర్కిల్...
By Sidhu Maroju 2025-07-29 17:08:50 0 844
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com