బొల్లారం రైల్వే గేట్ రిపేర్ కావడంతో ట్రాఫిక్ జామ్: వాహదారులకు తీవ్ర ఇబ్బందులు

0
748

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / బొల్లారం.

బొల్లారం గేట్ వద్ద 50 నిమిషాల ట్రాఫిక్ జాం – వర్షంలో వాహనదారుల తంటాలు”  రిసాలబజార్ నుంచి కొంపల్లి వెళ్లే మార్గంలో గంటపాటల పాటు నిరీక్షణ.  బొల్లారం రైల్వే గేట్ వద్ద రిపేర్ పనులు జరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  వర్షం కారణంగా సమస్య మరింత జటిలమై, రిసాలబజార్ నుంచి కొంపల్లి వెళ్లే మార్గంలో దాదాపు 50 నిమిషాల పాటు భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది.ప్రజలు ఇబ్బంది పడడమే కాకుండా .. వర్షంలో వందలాది మంది బైక్ రైడర్లు, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, పాదాచారులు  నిలిచిపోయారు.రైల్వే గేట్ వద్ద నిలిచిన వాహనాల క్యూలు కిలోమీటర్ ల మేర నిలిచిపోయాయి. ప్రయాణికులు వర్షంలో తడుస్తూ నిరీక్షించాల్సి వచ్చింది. ప్రజలు, స్థానికులు, వాహనదారులు మాట్లాడుతూ...   ప్రతి సారి రిపేర్ పేరుతో ఇలాగే గంటల తరబడి నిలిపేస్తారు. వర్షం వల్ల మరింత ఇబ్బంది పడుతున్నాం.ఇలాంటి పనులను ముందుగానే ప్రకటించి, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా పరిస్థితులు మళ్లీ రాకుండా రైల్వే గేట్ వద్ద శాశ్వత పరిష్కారం తీసుకురావాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.

    --Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ఏప్రిల్ ఒకటి నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్తు
*ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్*   * రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత *...
By Rajini Kumari 2026-01-29 13:35:10 0 162
Andhra Pradesh
పూలు నియోజకవర్గం :చౌడేపల్లిలో రాములవారు, సీతమ్మ ఊరేగింపు భారీగా జరిగింది.
చౌడేపల్లిలో రాములవారు, సీతమ్మల ఊరేగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో RGY...
By Kothuru Murali 2026-03-29 07:27:57 0 128
Telangana
మనూర్ :-. గ్యాస్ కు తప్పని తిప్పలు
మనూర్ మండలంలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం 2 గంటల నుంచే గ్యాస్ గోదాం వద్దా సిలిండర్ లా కోసం క్యూ లొ...
By Gandla Vaijanath 2026-03-27 03:37:55 0 240
Telangana
హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడిపై పోలీసుల హింస – మానవ హక్కుల సంఘం విచారణ
హైదరాబాద్‌ - హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడిని పోలీసులు అక్రమంగా కస్టడీలో పెట్టి...
By BMA ADMIN 2025-08-11 11:07:45 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com