పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన డిప్యూటీ సీ.ఎం. బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
817

మల్కాజ్ గిరి/ బోయిన్ పల్లి  

బోయిన్ పల్లి లోని NIEPID (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్ మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చ్వల్ డిసేబిలిటీస్)లో ఇస్మాయిలీ కమ్యూనిటీ ఆధ్వర్యంలోని అగాఖాన్ సోషల్ వెల్ఫేర్ బోర్డు వారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం లో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అగా ఖాన్ సోషల్ వెల్ఫేర్ బోర్డు వారు నిపిడ్ (NIEPID) వారితో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ స్వచ్ఛంద సంస్థ వారు చేపట్టడం అభినందనీయమని, దివ్యాంగులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న ఈ సంస్థలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని, తాను కూడా సొంతంగా మరియు ప్రభుత్వం ద్వారా అవసరమైన సహాయ సహకారాలు అందించి దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

    -సిద్దుమారోజు 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి మండలంలో మహిళా ఆత్మహత్య
గురువారం ఉదయం మదనపల్లి మండలంలోని కొత్తవారిపల్లి గ్రామంలో ప్రేమకుమారి (45) అనే మహిళ జీవితంపై...
By Pagadala Venkateswar 2026-01-29 05:53:27 0 102
Telangana
గంగయ్య బస్తీలో త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ.|
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 7వ వార్డు పరిధిలో ఉన్న గంగయ్య...
By Sidhu Maroju 2026-03-09 09:31:38 0 114
Telangana
కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగ
కొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరులో...
By Vanmoj Suryamohan 2026-03-30 03:40:14 0 79
Andhra Pradesh
వేట్లపాలెం పేలుడు బాధితులకు అండగా న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ
వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గూడపర్తి మాదిగపేటకు చెందిన ఏడుగురు మృతి చెందడం ప్రాంతాన్ని విషాదంలో...
By Ratna Sekhar 2026-02-28 19:39:46 0 511
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com