సామాజిక సేవలో డాక్టరేట్ పొందిన నర్ల సురేష్ ను అభినందించి సన్మానించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

0
689

మేడ్చల్ మల్కాజ్గిరి /ఆల్వాల్.  

సామాజిక సేవలో తనదైన రీతిలో ముందుకెళుతూ అందరి మన్ననలు పొందుతున్న ఆల్వాల్ కు చెందిన నర్ల సురేష్ ను గౌరవ డాక్టరేట్ వరించింది. ఈమేరకు తమిళనాడులోని హోసూర్ నగరంలో శనివారం ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ, రియల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నర్ల సురేష్ కు డాక్టరేట్ సర్టిఫికెట్ తో పాటుగా ప్రశంసా పత్రాన్ని నిర్వాహకులు అందజేశారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన వారితో పాటుగా సామాజికంగా సేవలు చేస్తున్నటువంటి సేవలను గుర్తిస్తూ డాక్టరేట్ ప్రదానం చేయడం జరుగిందని మచ్చబొల్లారం కేంద్రంగా వున్న సురేష్ సేవా సమితి వ్యవస్థాపక నిర్వాహకులు, చైర్మన్ నర్ల సురేష్ తెలిపారు. అల్వాల్ సర్కిల్ ల్లో గత 25 సంవత్సరాలుగా సామాజికంగా, రాజకీయంగా వివిధ రకాల సేవలను అందజేస్తున్నారు. ముఖ్యంగా పేదల అభ్యున్నతికి గాను సురేష్ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు ఇట్టి ప్రొత్సహకాలు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. భవిష్యత్తు లో సురేష్ సేవా సమితి మరింత పటిష్టంగా సామాజిక కార్యక్రమాలను రూపొందించుకుంటూ ముందుకెళుతుందని సురేష్ వివరించారు.

   -సిద్దుమారోజు. ✍️

Search
Categories
Read More
Media Academy
Digital Journalism: Telling Stories in a Modern World
Digital Journalism: Telling Stories in a Modern World The world has gone digital—and so...
By Media Academy 2025-04-29 08:15:04 0 2K
Telangana
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా, మల్కాజిగిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-07-06 17:38:56 0 914
Telangana
బీసీ ఓటర్లపై కాంగ్రెస్‌ ఆశలు పెంచింది |
జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సమరం వేడెక్కింది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఓసీ...
By Bhuvaneswari Shanaga 2025-10-16 05:40:01 0 96
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com