శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠం భూమి, లీజును రద్దు చేయండి.

0
931

మేడ్చల్ మల్కాజిగిరి  జిల్లా/ అల్వాల్

అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి కృష్ణవేణి కి కలిసి మచ్చ బొల్లారం డివిజన్ లోబాలాజీ రాధాకృష్ణ మఠం సర్వేనెంబర్ 91 లో ఉన్న ఒక ఎకరం 10 గుంటల భూమి ని ప్రైవేటు చారిటబుల్ ట్రస్ట్ కు లీజును రద్దు కొరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగాా.. అల్వాల్ సర్కిల్ బిజెపి నాయకులు మాట్లాడుతూ.. అల్వాల్ సర్కిల్లోని మచ్చ బొల్లారం డివిజన్లో ఉన్న అతి పురాతనమైన శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠం ఆధీనంలో ఉన్న సర్వేనెంబర్ 91 లో ఉన్న 1 ఎకరం 10 గుంటల భూమిని ప్రైవేటు చారిటబుల్ ట్రస్ట్ కు 11 సంవత్సరాలు నామమాత్రపు నెలవారి అద్దెతో దేవాలయ ఆధీనంలో ఉన్న భూమిని ప్రైవేటు వ్యక్తుల స్వాధీనంలోకి పోతుందని తెలిపారు.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం హిందూ దేవాలయాలను, దేవాలయాల ఆస్తులను అన్యక్రాంతం  చేస్తున్నారని తెలిపారు.  శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠంలో ఆధీనంలో ఉన్న ఒక ఎకరం 10 గుంటల భూమిలో నూతనంగా కళ్యాణమండపం  నిర్మించి స్థానిక ప్రజలకు, భక్తులకు అందుబాటులో తేవాలని సూచించారు.  హిందూ భక్తుల ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ప్రైవేటు వ్యక్తులకు ఇలా లీజును కొనసాగిస్తే దేవాలయ భూములపైన భారతీయ జనతా పార్టీ ప్రజా పోరాటం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ మాజీ కౌన్సిలర్  నిమ్మ  కృష్ణారెడ్డి, మచ్చ బొల్లారం అధ్యక్షుడు అజయ్ రెడ్డి, అల్వాల్ డివిజన్ అధ్యక్షుడు కార్తీక్ గౌడ్, వెంకటాపురం డివిజన్ నాయకులు ఆంటోనీ రవి కిరణ్, శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు మాచర్ల శ్రీనివాస్, సంజయ్ కుమార్, తూప్రాన్ లక్ష్మణ్, రాజిరెడ్డి, మహేంద్ర పాల్ సింగ్, అనిల్, సునీల్, కార్తీక్ రెడ్డి, భరత్, రాజు, అజయ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

  -సిద్దుమారోజు ✍️

Search
Categories
Read More
Telangana
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు..
నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిహెచ్ రవి కుమార్ తో పాటు, ప్రస్తుతం సి.ఏ.ఆర్ విభాగంలో అటాచ్డ్ లో...
By Gujile Ramu 2026-04-23 03:58:18 0 221
Andhra Pradesh
మైనర్ బాలికపై లైంగిక దాడి, తల్లి ఆత్మహత్యాయత్నం.
అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం గూడుపల్లి గ్రామంలో 10 ఏళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి...
By Pagadala Venkateswar 2026-03-23 04:02:04 0 179
Andhra Pradesh
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి అమరావతి, డిసెంబర్ 31: నూతన...
By Gadiyapudi Narendra 2025-12-30 10:53:45 0 245
Andhra Pradesh
చింతూరులో తృటిలో తప్పిన పెను ప్రమాదం: మంటల్లో దగ్ధమైన గూడ్స్ లారీ!
చింతూరు మార్గంలో బుధవారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుండి చింతూరు వైపు వెళ్తున్న...
By Shyamala Yadagiri 2026-06-03 15:45:18 0 208
Andhra Pradesh
22-A భూ సమస్యలకు పరిష్కారం.. 9 మంది రైతులకు ఊరట.
అన్నమయ్య జిల్లాలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 22-A భూ సమస్యలకు సోమవారం పరిష్కారం లభించింది....
By Pagadala Venkateswar 2026-06-30 07:10:45 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com