హరిహర వీరమల్లు సినిమా విజయవంతం అయిన సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం లో అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసిన జనసేన నాయకులు

0
887

సికింద్రాబాద్...

 

గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనసేన నాయకులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గబ్బర్ సింగ్ టీం,జనసేన పార్టీ నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.టిటిడి బోర్డు సభ్యుడు,జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ జనసేన అధ్యక్షులు రాదారం రాజలింగం, కూకట్పల్లి నియోజకవర్గం ఇన్చార్జి ప్రేమ్ కుమార్ లు తోటి నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వారిని ఆలయ పూజారులు ఆశీర్వదించి సన్మానించారు.తదనంరం ఆలయం ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... మా దైవం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని... హరిహర వీరమల్లు సినిమా విజయవంతమైనందుకు పవన్ కళ్యాణ్ గోత్రం, పేరుతో అర్చన చేపించి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. అతి త్వరలో పవన్ కళ్యాణ్ కూడా శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చి అమ్మవారి దీవెనలు తీసుకుంటారని చెప్పారు. కొందరు ఈ సినిమా పై విమర్శలు చేస్తున్నారని...ఒక సినిమాని సినిమా లాగానే చూడాలి గాని కొందరు పనిగట్టుకుని విమర్శిస్తున్నారని అది తగ్గదన్నారు.త్వరలో దేశంలో ఆక్టివ్ పాలిటిక్స్ లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఉంటారని ఈ సందర్భంగా వారు అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ మహోత్సవంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
గాలివీడు మండలం పందికుంట గ్రామం వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ...
By Benguluri Madhubabu 2026-03-08 13:31:10 0 167
Andhra Pradesh
మెప్మా శాఖలో స్కాంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్
🚨🚨 *Big Breaking News 🚨🚨   *పల్నాడు : మెప్మా శాఖలో స్కాంపై సీఎం చంద్రబాబు సీరియస్‌.*...
By Rajini Kumari 2025-12-20 12:45:10 0 123
Andhra Pradesh
AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది!
పండుగల నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పు చేసిన విద్యాశాఖ మార్చి 20కి బదులుగా 21న ఇంగ్లీషు పరీక్ష...
By Pagadala Venkateswar 2026-02-07 11:24:17 0 110
Andhra Pradesh
విజయవాడ ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్
...పౌరా పౌరాహక్కుల సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ క్రాంతి చైతన్య అక్రమంగా నిర్భందాన్ని నిరసిస్తూ...
By Rajini Kumari 2026-01-20 11:15:11 0 102
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com