హరిహర వీరమల్లు సినిమా విజయవంతం అయిన సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం లో అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసిన జనసేన నాయకులు

0
910

సికింద్రాబాద్...

 

గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనసేన నాయకులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గబ్బర్ సింగ్ టీం,జనసేన పార్టీ నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.టిటిడి బోర్డు సభ్యుడు,జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ జనసేన అధ్యక్షులు రాదారం రాజలింగం, కూకట్పల్లి నియోజకవర్గం ఇన్చార్జి ప్రేమ్ కుమార్ లు తోటి నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వారిని ఆలయ పూజారులు ఆశీర్వదించి సన్మానించారు.తదనంరం ఆలయం ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... మా దైవం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని... హరిహర వీరమల్లు సినిమా విజయవంతమైనందుకు పవన్ కళ్యాణ్ గోత్రం, పేరుతో అర్చన చేపించి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. అతి త్వరలో పవన్ కళ్యాణ్ కూడా శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చి అమ్మవారి దీవెనలు తీసుకుంటారని చెప్పారు. కొందరు ఈ సినిమా పై విమర్శలు చేస్తున్నారని...ఒక సినిమాని సినిమా లాగానే చూడాలి గాని కొందరు పనిగట్టుకుని విమర్శిస్తున్నారని అది తగ్గదన్నారు.త్వరలో దేశంలో ఆక్టివ్ పాలిటిక్స్ లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఉంటారని ఈ సందర్భంగా వారు అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా గోపూజ మహోత్సవం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో గోపూజ మహోత్సవం అత్యంత వైభవంగా,...
By Rajini Kumari 2026-01-14 12:38:32 0 151
Telangana
కిషన్ ప్రసాద్ కాలనీకి శాశ్వత పరిష్కారం - శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో గల కిషన్ ప్రసాద్ కాలనీలో జరుగుతున్న...
By Sidhu Maroju 2026-02-04 09:43:16 0 140
Telangana
గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*
*గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి* ...
By Vanmoj Suryamohan 2025-12-29 14:37:26 0 392
Telangana
కొత్త రకం దొంగతనాలు :ముగ్గురిని కటకటాల్లోకి నెట్టిన బోయిన్ పల్లి పోలీస్ లు
సికింద్రాబాద్.. ద్విచక్ర వాహనంపై వెళ్తూ సొమ్మసిల్లి రహదారిపై కుప్పకూలినట్లు నటిస్తారు.వెంటనే...
By Sidhu Maroju 2025-06-17 10:46:20 0 1K
Andhra Pradesh
మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
రంజాన్ పండగ పురస్కరించుకొని రాయిచోటి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కలిసిన పలువురు...
By Benguluri Madhubabu 2026-03-21 07:48:47 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com