వర్షంతో ఇబ్బందులు పడుతున్న బస్తీ వాసులను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
952

మల్కాజిగిరి జిల్లా/ కంటోన్మెంట్ 

 

ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి బస్తీలు కాలనీల లోకి వర్షపు నీరు చేరి ఇళ్ళలోకి కూడా రావడంతో ఆయా బస్తీ, కాలనీల వాసులు తీవ్ర ఇక్కట్లకు గురి అయ్యారు. ఇళ్ళలోకి నీళ్ళు వచ్చిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శ్రీగణేష్ కార్ఖానా లోని నారాయణ స్వామి టెంపుల్ ఏరియాలో పర్యటించి అక్కడి ప్రజలను పరామర్శించారు.ఇళ్ళలోకి నీరు చేరడంతో ఇళ్ళలోని వస్తువులు నీట మునిగాయి.స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి తక్షణమే అక్కడికి పిలిపించుకుని ఇళ్ళలోకి వచ్చిన నీటిని బయటకు పంపించాలని, వారికి అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని,ఏ అవసరం వచ్చినా నాకు సమాచారం ఇస్తే వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటానని, ఎలక్ట్రిసిటీ, శానిటేషన్ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అధికారులకు సూచించారు.తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు బస్తీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

#Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
మెదక్ జిల్లా కేంద్రంలో వార్డులను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పదో వార్డు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్...
By Gangaram Rangagowni 2026-01-14 11:33:47 0 202
Andhra Pradesh
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు ....
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి...
By SivaNagendra Annapareddy 2025-12-15 15:01:08 0 206
Telangana
గంగ అవెన్యూ వాసుల గోస.. రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గంగ అవెన్యూ మరియు దాని చుట్టుపక్కల కాలనీల నివాసితుల విజ్ఞప్తి మేరకు...
By Sidhu Maroju 2026-03-18 14:13:00 0 140
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com