రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్(REPA) ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి ఎంపీ. ఈటెల.

0
1K

రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్ ( REPA ) శంషాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రియల్ ఎస్టేట్ మన రాష్ట్రంలో ప్రధాన రంగం. మీరందరూ లక్షల కోట్ల టర్నోవర్ తో రాష్ట్ర, దేశ జీడీపీలో భాగస్వామ్యమవుతున్నారు. ప్రభుత్వాలు సరిగా సపందించకపోతే పని చేసే తృప్తి తపన ఉండదు. మీకు తోడు కావాల్సింది మంచి ఆలోచన ఉన్న ప్రభుత్వం. యువతకు ఉపాధి, పురోగమన కోణంలో ఆలోచించే ప్రభుత్వం ఉండాలనీ మీరు కూడా కోరుకుంటారు. మనదేశం అత్యంత ఎక్కువ యువశక్తి ఉన్నదేశం. 11వ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్ మూడవ ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి మీలాంటి వారి శ్రమ ఉంది. మోదీ గారు స్టేబుల్ ప్రభుత్వం అందిస్తున్నారు. రాష్ట్రాల సహకారం కూడా ఉండాలి. ఇక్కడ కూడా అలాంటి ప్రభుత్వం వస్తుంది అని హామీ ఇస్తున్నాము.  ఈ రంగంలో లక్షలమంది కార్మికులు పనిచేస్తున్నారు. వారి పట్ల కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ లో మార్పులు చేర్పులు కోసం చర్చలు జరుగుతున్నాయి.  వ్యాపారం చేసేవారిని దొంగలుగా చూడవద్దు అని నేను చెప్పిన, వేధింపులు ఉండకుండా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అందరూ పన్నులు కట్టే విధానం తీసుకురావాలని సూచించాను.  జీఎస్టీ విధానం విజయవంతంగా అమలు చేస్తున్నాం.

Search
Categories
Read More
Andhra Pradesh
AP Job Calendar: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉగాదికి జాబ్ క్యాలెండర్!
ఆర్థిక భారాన్ని అంచనా వేసిన తర్వాతే తుది ప్రకటన ఏపీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ...
By Pagadala Venkateswar 2026-01-31 07:00:32 0 51
Andhra Pradesh
గ్రామ, వార్డు స్థాయి కమిటీల నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ గారు.
నేడు మనందరి ప్రియతమ నాయకుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి...
By John Baji 2026-01-12 04:16:55 0 83
Telangana
పేదలకు చేతినిండా సాయం - ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 1.99 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  :  మల్కాజ్ గిరి నియోజకవర్గంలో సంక్షేమ డోర్ డెలివరీ...
By Sidhu Maroju 2026-01-18 10:19:09 0 109
Goa
Goa Government Introduces Strict Law Against Aggressive Dog Breeds
The Goa government is set to enact the Goa Animal Breeding and Domestication Bill, 2025,...
By Bharat Aawaz 2025-07-17 06:20:49 0 1K
Andhra Pradesh
గుంటూరు వెస్ట్ డీస్పీ శ్రీ కె. అరవింద్ గారు విద్యార్థులకు మాదగద్రవ్యాల అవగాహన సదస్సు సంకల్పం కార్యక్రమం చేసినారు. గుంటూరు జిల్లా ఎస్పీ మరియు ఐజి ఆదేశాల మేరకు.
గుంటూరు జిల్లా పోలీస్...* *పట్టాభిపురం పోలీస్ స్టేషన్* *తేది: 31.12.2025* _*//“డ్రగ్స్...
By KOTESWARARAO KVSR 2025-12-31 12:18:11 0 202
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com