రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్(REPA) ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి ఎంపీ. ఈటెల.

0
1K

రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్ ( REPA ) శంషాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రియల్ ఎస్టేట్ మన రాష్ట్రంలో ప్రధాన రంగం. మీరందరూ లక్షల కోట్ల టర్నోవర్ తో రాష్ట్ర, దేశ జీడీపీలో భాగస్వామ్యమవుతున్నారు. ప్రభుత్వాలు సరిగా సపందించకపోతే పని చేసే తృప్తి తపన ఉండదు. మీకు తోడు కావాల్సింది మంచి ఆలోచన ఉన్న ప్రభుత్వం. యువతకు ఉపాధి, పురోగమన కోణంలో ఆలోచించే ప్రభుత్వం ఉండాలనీ మీరు కూడా కోరుకుంటారు. మనదేశం అత్యంత ఎక్కువ యువశక్తి ఉన్నదేశం. 11వ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్ మూడవ ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి మీలాంటి వారి శ్రమ ఉంది. మోదీ గారు స్టేబుల్ ప్రభుత్వం అందిస్తున్నారు. రాష్ట్రాల సహకారం కూడా ఉండాలి. ఇక్కడ కూడా అలాంటి ప్రభుత్వం వస్తుంది అని హామీ ఇస్తున్నాము.  ఈ రంగంలో లక్షలమంది కార్మికులు పనిచేస్తున్నారు. వారి పట్ల కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ లో మార్పులు చేర్పులు కోసం చర్చలు జరుగుతున్నాయి.  వ్యాపారం చేసేవారిని దొంగలుగా చూడవద్దు అని నేను చెప్పిన, వేధింపులు ఉండకుండా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అందరూ పన్నులు కట్టే విధానం తీసుకురావాలని సూచించాను.  జీఎస్టీ విధానం విజయవంతంగా అమలు చేస్తున్నాం.

Search
Categories
Read More
Telangana
ప్లాన్ బితో మంగ్లీకి షాకిచ్చిన అడ్వకేట్ సుబ్బారావు.. ముదురుతున్న చీటింగ్ కేసు వివాదం!
ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ మైక్రో ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ మోసం ఆరోపణలు ముదురుతున్నాయి....
By Ponnala Srinivasrao 2026-04-17 02:01:10 0 91
Andhra Pradesh
ఘనంగా ప్రారంభమైన సోమేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన
*స్క్రోలింగ్ కొరకు*   ఆచంట 21-12-2025     ➖ *ఘనంగా ప్రారంభమైన ఆచంట...
By Rajini Kumari 2025-12-21 14:04:18 0 212
Telangana
నూతన ITDA PO గా లెనిన్
ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారి (పీఓ) గా Lenin Vatsal Toppo నియామకం
By Bittu Bittu 2026-04-26 00:47:30 0 423
Telangana
ఖమ్మం జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు..
ఖమ్మం జిల్లాలో 10 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి...
By Krishna Balina 2026-03-06 09:48:03 0 202
Andhra Pradesh
వ్యాధి నిర్ధారణలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకం.. బాపట్ల జిల్లా డిఎంహెచ్ ఓ శ్రీమతి డాక్టర్ విజయమ్మ......
  బాపట్ల జిల్లా: ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు వ్యాధి నిర్ధారణ చేయడంలో ల్యాబ్...
By Gadiyapudi Narendra 2026-02-03 16:08:40 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com