ఉన్నత పాఠశాలను  ఆకస్మికంగా  తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ . 

0
1K

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను  ఆకస్మికంగా  తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ . 

ఈ సందర్భంగా తరగతి గదుల్లో పరిశుభ్రతను పాటించాలని, పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ,వంట సరుకుల నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

పదవ తరగతి విద్యార్థులకు బోధన పద్ధతులను సమీక్షించి, విద్యార్థులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బోధన, పిల్లల సౌకర్యాలలో ఎలాంటి లోపాలు ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఉపాధ్యాయులు సమయపాలన తప్పకుండా పాటించాలని తెలిపారు.

ఈ పర్యటనలో మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, మల్లాపూర్ తహసిల్దార్ రమేష్ మరియు  ఎంపీడీవో శశికుమార్ సంబంధిత అధికారులు కలెక్టర్ గారితో కలిసి పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
"భక్తిశ్రద్దలతో ధనుర్మాస సంకీర్తనలు"...
  కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామం "రామకృష్ణా నగర్" లో...
By BABJI DADALA 2025-12-22 07:53:02 0 744
Telangana
మరొకరి ప్రాణం తీసిన చైనా మాంజా.|
    హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలో చైనా మాంజాతో గొంతు తెగి వ్యక్తి...
By Sidhu Maroju 2026-01-15 07:31:41 0 111
Andhra Pradesh
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన నడిపించిన తాడేపల్లి పోలీసులు.
 *గుంటూరు జిల్లా పోలీస్...* *తాడేపల్లి పోలీస్ స్టేషన్...* *ది.25.12.2025* _*//ఆటో డ్రైవర్...
By KOTESWARARAO KVSR 2025-12-25 12:23:57 0 144
Telangana
సికింద్రాబాద్ పేరును మారుస్తున్నారనేది నిజం కాదు: కాంగ్రెస్ నేతలు.,|
హైదరాబాద్ : సికింద్రాబాద్ పేరును మారుస్తున్నారని ప్రజలను తప్పు దోవ పట్టించి తలసాని రాజకీయ...
By Sidhu Maroju 2026-01-17 15:06:12 0 102
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com