కంటోన్మెంట్ బోర్డు సిఈఓ మధుకర్ నాయక్ తో ఎమ్మెల్యేశ్రీగణేష్ భేటీ

0
907

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యి నియోజకవర్గం లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పలు అంశాలను ఎమ్మెల్యే సీఈఓ తో  చర్చించారు. ప్రధానంగా మర్రి రాంరెడ్డి కాలనీలో వర్షాకాలం నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుండి వచ్చే వర్షపు నీటితో ముంపునకు గురవుతున్న తరుణంలో నాల విస్తరణ పనులు చేపట్టి ముంపు ప్రాంతాలకు విముక్తి కలిగించాలని అన్నారు. దోబీ ఘాట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీకి కంటోన్మెంట్ నుండి లేఖ రాయడంపై జాప్యం చేయవద్దని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి చేసే అభివృద్ధి పనుల విషయంలో కంటోన్మెంట్ బోర్డు ఎన్ఓసి విధానాన్ని సడలించాలని కోరారు. తిరుమలగిరి చెరువు, బోయిన్ పల్లి రామన్న కుంట చెరువుల సుందరీ కరణ పనులు వేగవంతం చేయడంతో పాటు పాలనాపరమైన అనుమతుల విషయంలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో వెటర్నరీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఈవో ను కోరారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ బోర్డు కు వచ్చే 303.62 కోట్ల రూపాయల నిధులకు ఎన్ఓసి మంజూరు చేయాలని కూడా  సీఈఓ ను కోరడం జరిగింది.

Search
Categories
Read More
Karnataka
తుంగభద్ర డ్యాం సమస్యలు: నీటి నష్టం, సిల్టేషన్, మరియు పరిష్కారాల ఆలస్యం
సమస్య: తుంగభద్ర డ్యాం క్రెస్ట్ గేట్ దెబ్బతినడంతో భారీగా నీరు వృథా అవుతోంది.సామర్థ్యం తగ్గింపు:...
By Triveni Yarragadda 2025-08-11 06:20:45 0 468
Telangana
అల్వాల్ అంజనాపురి కాలనీలో భారీ చోరీ.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ అల్వాల్ అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిమ్మప్ప తెలిపిన...
By Sidhu Maroju 2025-07-29 10:51:37 0 653
Delhi - NCR
Parliament’s Both Houses Adjourned Amid Uproar
New Delhi: The proceedings of both the Lok Sabha and Rajya Sabha were adjourned today following...
By BMA ADMIN 2025-08-11 11:21:30 0 706
Andhra Pradesh
TTD Improves Annaprasadam Supply | టీటీడీ అన్నప్రసాద సరఫరా మెరుగ్గా
తిరుమల తిరుపతి దేవస్థానం (#TTD) అన్నప్రసాదం కోసం కూరగాయల దానాలను మరింత సులభతరం చేయడానికి ప్రత్యేక...
By Rahul Pashikanti 2025-09-10 09:06:00 0 24
Telangana
ఇందిరా పార్క్ ధర్నాను జయప్రదం చేయండి: అఖిలపక్ష నాయకుల పిలుపు.
ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా తేదీ 17జూన్ నాడు నిర్వహించే ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాను...
By Sidhu Maroju 2025-06-15 11:28:15 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com