ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు : నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్

0
1K

సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రత దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. అమ్మవారి బోనాల జాతర జయప్రదం చేసేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. పోలీసు శాఖ తరపున 2000 మంది సిబ్బంది బోనాలు, రంగం కార్యక్రమంలో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు, బోనాలతో వచ్చే మహిళలకు మొత్తం ఆరు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు అందులో బోనాల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత తో పాటు నూతనంగా 40 సీసీ కెమెరాలు కూడా పెంచినట్లు వెల్లడించారు.ఈ ఏడాది కూడా డీజేలకు అనుమతి లేదని, ఫలహరం బండ్లు ఊరేగించేవారు తమను సంప్రదిస్తే వారికి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ వసతి కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. జూలై 13, 14వ తేదీలలో జరిగే బోనాల ఉత్సవాలకు ప్రజలు రావాలని ఆహ్వానించారు. బోనాలతో వచ్చే మహిళలను పిల్లలను కుటుంబ సభ్యులను బొనాల క్యూ లైన్ లో అనుమతి ఇస్తామని తెలిపారు. బోనాల రోజు బాటా కూడలి నుండి మధ్యాహ్నం ఒంటిగంట నుండి మూడు గంటల వరకు శివసత్తులు, జోగిని లకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: నాలెడ్జ్, క్రియేటర్ ఎకానమీగా ఏపీ.. టెక్ దిగ్గజాలతో చంద్రబాబు విస్తృత చర్చలు.
Chandrababu Naidu Aims to Transform AP into Knowledge and Creator Economy Hub నాలెడ్జ్,...
By Pagadala Venkateswar 2026-02-21 04:45:08 0 101
Andhra Pradesh
మదనపల్లెలో చీటీల మోసం పై పీజీఆర్ఎస్ ఫిర్యాదు.
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, చీటీల పేరుతో స్థానికుల నుంచి...
By Pagadala Venkateswar 2026-02-10 04:48:32 0 96
Andhra Pradesh
మదనపల్లి ఆటో బోల్తా ప్రయాణికుడు మృతి.
ఆదివారం అర్ధరాత్రి మదనపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాల్మీకిపురం మండలం మొరవపల్లికి చెందిన...
By Pagadala Venkateswar 2026-02-09 08:11:22 0 91
Andhra Pradesh
శ్రీకాకుళం: 'టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలి'
శ్రీకాకుళం నగరంలో జర్నలిస్టుపై జరిగిన దాడికి నిరసనగా జర్నలిస్టు నాయకులు ఆందోళన చేపట్టారు. ఆ...
By Manda Ramkumar 2026-03-28 09:00:03 0 135
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com