ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు : నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్

0
933

సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రత దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. అమ్మవారి బోనాల జాతర జయప్రదం చేసేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. పోలీసు శాఖ తరపున 2000 మంది సిబ్బంది బోనాలు, రంగం కార్యక్రమంలో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు, బోనాలతో వచ్చే మహిళలకు మొత్తం ఆరు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు అందులో బోనాల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత తో పాటు నూతనంగా 40 సీసీ కెమెరాలు కూడా పెంచినట్లు వెల్లడించారు.ఈ ఏడాది కూడా డీజేలకు అనుమతి లేదని, ఫలహరం బండ్లు ఊరేగించేవారు తమను సంప్రదిస్తే వారికి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ వసతి కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. జూలై 13, 14వ తేదీలలో జరిగే బోనాల ఉత్సవాలకు ప్రజలు రావాలని ఆహ్వానించారు. బోనాలతో వచ్చే మహిళలను పిల్లలను కుటుంబ సభ్యులను బొనాల క్యూ లైన్ లో అనుమతి ఇస్తామని తెలిపారు. బోనాల రోజు బాటా కూడలి నుండి మధ్యాహ్నం ఒంటిగంట నుండి మూడు గంటల వరకు శివసత్తులు, జోగిని లకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.

 

 

Search
Categories
Read More
Telangana
ఇవాళ తులం రూ.3,280 పెరిగిన బంగారం ధర |
అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న అనిశ్చిత పరిస్థితులు, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల...
By Bhuvaneswari Shanaga 2025-10-14 11:44:17 0 27
Andhra Pradesh
4 వేల కొలువులు: ఈ నెలే మున్సిపల్, పంచాయతీ డీఎస్సీ |
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పంచాయతీ రాజ్ శాఖలలో...
By Meghana Kallam 2025-10-10 04:45:14 0 157
Andhra Pradesh
నేవీతో రోల్స్ రాయిస్ కీలక ఒప్పందం |
భారత నౌకాదళ శక్తిని మరింత ఆధునీకరించేందుకు ఇండియన్ నేవీ, రోల్స్ రాయిస్ సంస్థతో కీలక ఒప్పందానికి...
By Bhuvaneswari Shanaga 2025-10-16 12:54:10 0 41
Telangana
చాకలి ఐలమ్మ జీవితం నేటితరాలకు స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే శ్రీ గణేష్
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిఖ్ విలేజ్ దోభీఘాట్...
By Sidhu Maroju 2025-09-26 09:01:30 0 82
Telangana
హైదరాబాద్‌లో బంగారం ధరలు పెరుగుదల |
హైదరాబాద్‌లో బంగారం ధరలు పెరుగుదల చూపిస్తున్నాయి. 24 క్యారట్ బంగారం ధర గ్రాం కు  ₹...
By Bhuvaneswari Shanaga 2025-09-23 07:40:37 0 30
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com