శ్రీ చైతన్య పాఠశాల సుచిత్ర బ్రాంచ్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం - గ్రీన్ ఇండియా మిషన్.

0
1K

 

కొంపల్లి జోన్ ,సుచిత్ర బ్రాంచ్ లో  స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో చెట్లను నాటి పచ్చదనం పట్ల అవగాహన కల్పించారు.విద్యార్థుల చేత ర్యాలీని నిర్వహించి మొక్కలు పెంచడం పట్ల అవగాహన కల్పించే విధంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏ.జీ.యం రమణారావు మాట్లాడుతూ ,మొక్కలను నాటి వాటిని సంరక్షించడమే మన భవిష్యత్తు తరం కోసం పెట్టె గొప్ప పెట్టుబడి అని అన్నారు. శ్రీ చైతన్య భావితరానికి స్ఫూర్తిగా మారుతుందని ఆయన ప్రశంసించారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని చెప్పారు.  ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొంపల్లి జోన్ ఏ.జీ.యం రమణారావు ,ఆర్.ఐ. చక్రి , కొంపల్లి జోన్ కోఆర్డినేటర్స్ రవి కుమార్ , బ్రాంచ్ ప్రిన్సిపల్ భావన ,అకడమిక్ డీన్ వెంకట్ , సి అండ్ ఐకాన్ ఇంచార్జ్ దుర్యోధనారావు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
🌧️ గత 3 రోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు – నగరం జలమయంగా మారింది
హైదరాబాద్‌ - గత మూడు రోజులుగా హైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నిరంతర...
By BMA ADMIN 2025-08-16 07:08:53 0 1K
Andhra Pradesh
మదనపల్లి లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు: కలెక్టర్.
మదనపల్లి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని...
By Pagadala Venkateswar 2026-01-29 11:53:36 0 41
Telangana
భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా ధర్నా.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి జిల్లా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు...
By Sidhu Maroju 2025-11-29 10:26:39 0 104
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com