కర్నూలు నుండి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభం

0
1K

కర్నూలు ఎయిర్పోర్టులో కర్నూలు నుండి విజయవాడ విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టీజి భరత్ ,బీసి జనార్దన్ రెడ్ది గారితో కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్బంగా ఎంపీ నాగరాజు వర్చువల్ గా రామమోహన్ నాయుడు గారితో మాట్లాడుతూ కర్నూలు నుండి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభం కావడం తో జిల్లా వాసుల కల నెరవేరిందన్నారు.. రాష్ట్రంలో సపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే ఇక్కడ విమాన సర్వీసులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక సంవత్సరం లోనే ఇది సాధించుకోగలిగామన్నారు.. కర్నూలు ఎయిర్పోర్ట్ ను మరింతగా అభివృద్ధి చేసి విమానాశ్రయం రూపు రేఖలు మార్చడంతో పాటు నైట్ ల్యాండింగ్ సౌకర్యం కూడా కలిపించాలని కేంద్ర మంత్రి గారిని ఎంపీ నాగరాజు కోరారు.. ఈ కార్యక్రమం లో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ,పాణ్యం ఎంఎల్ఏ చరిత ,జాయింట్ కలెక్టర్ నవ్య తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
చంద్రన్న జన్మదిన వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ
చంద్రన్న జన్మదిన వేడుకలు... పోస్టర్ ఆవిష్కరణ... గాంధీనగర్ ప్రెస్ క్లబ్   విజయవాడ:...
By Rajini Kumari 2026-04-19 12:39:33 0 87
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా ఎస్ వి రాజశేఖర్ బాబు కామెంట్స్
**ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*:   విజయవాడ పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు సిపి ఎస్.వి.రాజ శేఖర...
By Rajini Kumari 2025-12-30 10:30:36 0 179
Telangana
ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో కొంపల్లిలో గణపతి ప్రతిష్ట”.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కొంపల్లి గ్రేటర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గణపతి ప్రతిష్ట కార్యక్రమం...
By Sidhu Maroju 2026-03-29 08:15:59 0 114
Andhra Pradesh
శుభారాం డిగ్రీ కాలేజీలో ముందుగా ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు
పుంగనూరులోని శుభారామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకటేషులు...
By Kothuru Murali 2026-01-07 02:34:59 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com