ఇందిరా పార్క్ ధర్నాను జయప్రదం చేయండి: అఖిలపక్ష నాయకుల పిలుపు.

0
1K

ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా తేదీ 17జూన్ నాడు నిర్వహించే ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చెయ్యాలని నేడు షాపూర్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయంలో వామపక్ష పార్టీల నాయకులు గోడపత్రికను విడుదల చెయ్యడం జరిగింది. సిపిఐ జాతీయ సమితి సభ్యులు యూసఫ్,జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,సిపిఎం మండల కార్యదర్శి లక్ష్మణ్,సిపిఐ ఎమ్ ఎల్ నాయకులు అనురాధ,శివబాబు, మాస్ లైన్ కార్యదర్శి ప్రవీణ్,సిపిఎం నాయకులు అంజయ్య,సత్యం, స్వాతి లు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశంలో మావోయిస్టు లను ఏరివేత పేరుతో చంపుతాం అని బహిరంగాగా ప్రకటించడం రాజ్యాంగం కల్పించిన మనిషి జీవించే హక్కును కాలరాయడమే నని, చర్చలు జరుపడానికి సిద్ధం అని ప్రకటించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమాని,ఇతర దేశాలతో చర్చలు జరుపడానికి సిద్దమైన ప్రభుత్వం,స్వంత పౌరులతో చర్చలు జరపకపోవడం బీజేపీ దుర్నితిని తెలియచేస్తుందని, ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టు లను అంతం అనే పేరుతో ఖనిజాలను అడవులను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చెయ్యడేమనని పర్యావరణంను కాపాడుకోవాలంటే ఆపరేషన్ కాగార్ ను ఆపాల్సిందే నని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలాని కోరారు.  ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నర్సింహారెడ్డి,వంశీ, జంబూ,లక్ష్మి,సిపిఎం నాయకులు శ్రీను,కరుణాకర్,ఎమ్ డి బాషా తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పోటాపోటీగా జాతీయ స్థాయి యోగాసనా పోటీలు క్షేత్రస్థాయికి "యోగ" ఫలాలు చేర్చేందుకు ఇండియన్ యోగా ఫెడరేషన్ కృషి..
పోటాపోటీగా జాతీయ స్థాయి యోగాసనా పోటీలు  క్షేత్రస్థాయికి "యోగ" ఫలాలు చేర్చేందుకు ఇండియన్ యోగా...
By Gadiyapudi Narendra 2025-12-28 16:09:02 0 376
Telangana
బీజేపీ నేత సాయి కిరణ్ గృహప్రవేశం… ప్రముఖుల సమక్షంలో వేడుకలు.|
హైదరాబాద్ : బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి కిరణ్  గృహప్రవేశ కార్యక్రమం నిజామాబాద్...
By Sidhu Maroju 2026-04-11 11:45:04 0 159
Andhra Pradesh
సీఎం పర్యటనలో అలసత్వం వద్దు: హోంమంత్రి అనిత
పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి CM చంద్రబాబు ఈనెల 28న రావివలస రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు...
By Boiena Rajesh 2026-02-25 14:30:25 0 260
Kerala
Kerala Sees Surge in Women-Led MSMEs, Home-Based Businesses Rise |
Kerala has witnessed the launch of over 350,000 new micro, small, and medium enterprises in the...
By Pooja Patil 2025-09-16 06:13:35 0 160
Telangana
ఎన్. రాంచందర్ రావ్, ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు మారుమోగుతోంది. ఇంతకీ ఈ ఎన్. రాంచందర్ రావ్ ఎవరంటే..!
హైదరాబాద్ కు చెందిన నరపరాజు రాంచందర్ రావు రాజనీతి శాస్త్రంలో ఎంఏతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ...
By Sidhu Maroju 2025-07-01 06:07:57 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com