బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలుగా నడికట్ల రోజా నియామకం. నియామక పత్రాన్ని అందజేసిన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

0
1K

  మల్కాజిగిరి  జిల్లా కుత్బుల్లాపూర్ బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలు గా నడికట్ల రోజాను నియమించారు. శనివారం గండి మైసమ్మ బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ సమావేశంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా నడికట్ల రోజా మాట్లాడుతూ... పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకోవడం తనకి ఎంతో సంతోషంగా ఉందని, తనకిచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, ఆకుల విజయ్, రెడ్డం రాజేశ్వరి, వెంకటేష్ నాయక్, ఆంజనేయులు, విగ్నేష్ చారి, ఆకుల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీపురుపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో డెడ్ బాడీ కలకలం
చీపురుపల్లి రైల్వేస్టేషన్ శివారున రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు శ్రీకాకుళం రైల్వే జీఆర్పీ...
By Boiena Rajesh 2026-03-06 12:37:02 0 169
Telangana
ట్రాఫిక్ ఇంటర్నెట్ అంతరాయాలపై స్థానికులతో కలిసి ధర్నా.|¢¢¢¢¢¢¢¢¢
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఓల్డ్ ఆల్వాల్–సుచిత్ర ప్రధాన రహదారిపై ఉన్న TCS...
By Sidhu Maroju 2026-01-25 16:57:28 0 130
Andhra Pradesh
కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు వాటర్ ట్యాంకుల ప్రారంభోత్సవం
*ప్ర‌చుర‌ణార్థం* *10-01-2026*   *మ‌రో ప‌దిహేను రోజుల్లో నిర్మాణం...
By Rajini Kumari 2026-01-10 13:08:24 0 109
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com