బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలుగా నడికట్ల రోజా నియామకం. నియామక పత్రాన్ని అందజేసిన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

0
1K

  మల్కాజిగిరి  జిల్లా కుత్బుల్లాపూర్ బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలు గా నడికట్ల రోజాను నియమించారు. శనివారం గండి మైసమ్మ బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ సమావేశంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా నడికట్ల రోజా మాట్లాడుతూ... పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకోవడం తనకి ఎంతో సంతోషంగా ఉందని, తనకిచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, ఆకుల విజయ్, రెడ్డం రాజేశ్వరి, వెంకటేష్ నాయక్, ఆంజనేయులు, విగ్నేష్ చారి, ఆకుల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి -MLA.
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా, ఆదివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొండమర్రిపల్లి...
By Pagadala Venkateswar 2026-04-06 04:20:53 0 121
Telangana
నిజామాబాద్: ఎందుకాంత స్పిడు
నిజామాబాద్: పోలీస్ కమీషనర్ పరిధిలో ప్రమధలు అంధోలన కలేగిస్తున్న యీ. పోలీసులు జిల్లా వ్యాప్తంగ...
By Sadaq Sadaq 2026-04-20 10:28:56 0 79
Telangana
ఎమ్మెల్యే ని కలిసిన ఎస్ వి ఎస్ పవన్ రెసిడెన్సీ ఓనర్స్ అసోసియేషన్ వాసులు
 మచ్చ బొల్లారం డివిజన్ ఎస్ వి ఎస్ పవన్ రెసిడెన్సి ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు పవన్...
By Sidhu Maroju 2025-06-15 16:46:30 0 1K
Telangana
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తా : MLC.శంబిపూర్ రాజు.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ...
By Sidhu Maroju 2025-12-28 10:01:22 0 175
Andhra Pradesh
చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.
వక్ఫ్ బోర్డు చరిత్రలో తొలిసారి.  చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ...
By John Baji 2026-02-03 03:29:18 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com