బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలుగా నడికట్ల రోజా నియామకం. నియామక పత్రాన్ని అందజేసిన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

0
1K

  మల్కాజిగిరి  జిల్లా కుత్బుల్లాపూర్ బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలు గా నడికట్ల రోజాను నియమించారు. శనివారం గండి మైసమ్మ బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ సమావేశంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా నడికట్ల రోజా మాట్లాడుతూ... పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకోవడం తనకి ఎంతో సంతోషంగా ఉందని, తనకిచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, ఆకుల విజయ్, రెడ్డం రాజేశ్వరి, వెంకటేష్ నాయక్, ఆంజనేయులు, విగ్నేష్ చారి, ఆకుల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మే 17వ తేదీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష !!
కర్నూలు : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ప్రవేశానికి నిర్వహించే జే ఈ ఈ అడ్వాన్సుడ్...
By Hari Krishna 2025-12-30 00:47:33 0 235
Odisha
Subhadra Yojana: ₹5,106 Crore Empowering Odisha Women
In a landmark move for women's empowerment, the Odisha government successfully deposited a...
By Lokeshwari Panthadi 2026-07-02 07:26:29 0 68
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై చిన్నారులకు పోలియో చుక్కలు
ప్రెస్ నోట్ విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి...
By Rajini Kumari 2025-12-22 08:20:13 0 247
Telangana
క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని...
By Nookapangu Manikanta 2026-04-29 10:58:41 0 143
Andhra Pradesh
బుల్లెట్ 350పై చంద్రబాబు సవారీ... ఫొటోలు ఇవిగో!.
  బుల్లెట్ 350పై చంద్రబాబు సవారీ... ఫొటోలు ఇవిగో! Andhra Chandrababu Naidu Rides Royal...
By Pagadala Venkateswar 2026-05-19 05:28:38 0 81
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com