మలివిడతలో 2,634మందికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్

0
9

మలివిడతలో 2,634మందికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్

మంగళగిరి: మన ఇల్లు – మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా వరుసగా రెండోరోజు కూడా మంత్రి నారా లోకేష్ 6 గంటలపాటు నిలబడి పట్టాలు పంపిణీ చేశారు. రెండోరోజున ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటలవరకు 6గంటలపాటు సికె కన్వెన్షన్ వేదికపై నుంచి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. తొలిరోజున 1331మందికి, రెండోరోజున 1303మందికి మొత్తంగా 2,634మందికి నూతన వస్త్రాలు పెట్టి పట్టాలు అందించారు. మలివిడతలో మంత్రి లోకేష్ అందజేసిన పట్టాల మార్కెట్ విలువ సుమారు రూ.1000 కోట్లుగా ఉంది. రెండోరోజు కూడా ఓపికగా నిలబడి పట్టాలు అందించిన లోకేష్... పలువురు దివ్యాంగ లబ్ధిదారులకు వేదిక కిందకు దిగి వెళ్లి పట్టాలను అందించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి లబ్ధిదారు, వారి కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు. తొలివిడత గత ఏడాది ఏప్రిల్ నెలలో 3,003 మందికి పట్టాలు అందజేశారు. 2029లోగా నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూముల్లో దీర్ఘకాలంగా నివాసముంటున్న ప్రతి లబ్ధిదారుడికి పట్టాలు అందజేస్తానని గత ఎన్నికల సమయంలో యువనేత లోకేష్ హామీ ఇచ్చారు. ఇరిగేషన్, రెవిన్యూ, అటవీ, దేవాదాయ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, రైల్వే తదితర శాఖలకు చెందిన భూముల్లో పేదలు దాదాపు మూడు దశాబ్దాలకు పైబడి ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. నాడు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వివిధ శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ పలుమార్లు సంప్రదింపులు జరిపి, శాఖలవారీగా స్థలాల సమస్యను పరిష్కరించారు. కేంద్రప్రభుత్వంతో ముడిపడివున్న మరికొన్ని భూముల సమస్యను పరిష్కరించాల్సి ఉంది. వాటిపై కూడా కేంద్ర పెద్దలతో మంత్రి లోకేష్ సంప్రదింపులు జరుపుతున్నారు.

Search
Categories
Read More
Tamilnadu
Tamil Nadu Strengthens Coastal Security and Conservation
Tamil Nadu is enhancing coastal security and marine conservation through coordinated efforts...
By Fathima Safa 2026-06-29 10:22:55 0 73
Telangana
నిజామాబాద్
19వ డివిజన్ పరిధిలోని కంఠేశ్వర్ గుట్ట ప్రాంతంలో డ్రైనేజీ సమస్యలు తన దృష్టికి రావడంతో తన సొంత...
By Sadaq Sadaq 2026-05-23 02:13:05 0 102
Andhra Pradesh
పుంగనూరు: అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు నివారించవచ్చు
ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్...
By Kothuru Murali 2026-04-19 11:08:54 0 95
Andhra Pradesh
ఈ నెల 13న సిఎండీపీఎఫ్ సమావేశం
విశాఖ అర్బన్; ఈనెల 13న క్రిస్టియన్ .ముస్లిం.దళిత పొలిటికల్ ప్రంట్ జాతీయ సమావేశం గవర్నర్ పేట హోటల్...
By Mobbu Venkatramana 2026-01-07 04:20:05 1 2K
Andhra Pradesh
చిత్తూరు ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరణ
చిత్తూరు జిల్లాలో ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా శ్రీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరించారు....
By Kothuru Murali 2026-05-29 13:20:08 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com