"ఆల్వాల్ అభివృద్ధిపై శాంతి శ్రీనివాస్ రెడ్డి నజర్.|

0
253

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ల్లోని పలు బస్తీల్లో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరారు.

బుధవారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజను ఆమె కార్యాలయంలో కలిసి క్షేత్రస్థాయి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. 

ముఖ్యంగా లక్ష్మీ నగర్ (లోత్ కుంట), ఇంద్రానగర్, భీమ్ రావు నగర్, ఎంఈఎస్ కాలనీ, ప్రశాంత్ నగర్, బండబస్తీ, వెంకట్రావు పేట మరియు స్టేషన్ బస్తీ ప్రాంతాల్లో ఇప్పటికే మంజూరైన పనులు నత్తనడకన సాగుతుండటంపై శాంతి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పనుల జాప్యం కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పౌర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. మంజూరైన ప్రతి పనిని తక్షణమే పట్టాలెక్కించి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా పూర్తి చేయాలని ఈడీని కోరారు. 

దీనిపై సానుకూలంగా స్పందించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షించి, జాప్యాన్ని నివారించేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పెండింగ్ పనులన్నింటినీ త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు.

#sidhumaroju

Alwal

Like
1
Search
Categories
Read More
Telangana
యూపీఎస్ స్కూల్‌లో యాంటీ డ్రగ్స్ కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు ...
By Sidhu Maroju 2026-06-24 08:31:09 0 74
Andhra Pradesh
HOD మరియు సెక్రెటరీ ఉద్యోగులకు రాజధానిలో ఇళ్ల స్థలాల అంశాన్ని సీఎం దృష్టికి కి తీసుకువచ్చిన ఏపీ ఎన్జీవో నేతలు ఏ విద్యాసాగర్ డివి రమణ
    *కొత్త ఏడాదిలో నూత‌నుత్తేజంతో ప‌నిచేద్దాం* - *స‌మ‌ష్టి...
By Rajini Kumari 2025-12-30 09:53:30 0 193
Telangana
జనావాసాల మధ్య మద్యం దుకాణాలు: నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ.|
సికింద్రాబాద్ : జనావాస ప్రాంతాలలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ బేగంపేట...
By Sidhu Maroju 2025-11-01 17:10:55 0 247
Andhra Pradesh
మై టిడిపి పోస్టర్ను ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మై టిడిపి పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ప్రతి...
By Benguluri Madhubabu 2026-02-17 05:44:28 0 269
Andhra Pradesh
గంజాయి విక్రయిస్తుల ముగ్గుల అరెస్ట్
మదనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు....
By Pagadala Venkateswar 2026-01-15 07:41:43 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com