TTD: మార్చి 3న చంద్రగ్రహణం... భక్తులకు టీటీడీ అలర్ట్.

0
128

మార్చి 1, 2 తేదీల్లో స్లాట్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నామన్న టీటీడీ

వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు సహా అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడి

మార్చి 3న రాత్రి 8:30 నుంచి తిరిగి దర్శనాలు ప్రారంభమవుతాయన్న టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నందున, రెండు రోజుల పాటు స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం, మార్చి 1, 2 తేదీల్లో తిరుపతిలోని కౌంటర్లలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయబడవు. 

 

టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఆగమశాస్త్ర నియమాల అనుసరించి, గ్రహణ సమయంలో ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ క్రమంలో మార్చి 3న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. 

 

గ్రహణం కారణంగా మార్చి 3న శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటివాటిని టీటీడీ రద్దు చేసింది. వీటితో పాటు వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

 

భక్తులను రాత్రి 8:30 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు. అయితే, మార్చి 4వ తేదీ దర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లను యథావిధిగా మార్చి 3న జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ మార్పులను గమనించి, తమ ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం చంద్రబాబును కలిసిన గద్దె రామ్మోహన్ ఎంపీ కేసినేని
*విజ‌య‌వాడ‌* *25-12-2025*   *సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్,...
By Rajini Kumari 2025-12-25 07:43:31 0 198
Telangana
"తాడ్‌బండ్‌లో భక్తి వెల్లువ… హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా!"
సికింద్రాబాద్ : తాడ్‌బండ్‌లోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం హనుమాన్ జయంతి సందర్భంగా...
By Sidhu Maroju 2026-04-02 06:49:09 0 185
Andhra Pradesh
మున్సిపల్ వార్డుల పునర్విభజన గడువు పెంపు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.
ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి...
By Pagadala Venkateswar 2026-04-08 06:03:02 0 134
Telangana
బీజేపీలో చేరనున్న తెలంగాణ లోని కీలక నేత కుటుంబం.!
ఇటీవల ఢిల్లీ పెద్దలతో ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్ల పై ఆ కీలక నేతతో కుదిరిన బేరం.. మల్కాజిగిరి...
By Ponnala Srinivasrao 2026-05-06 05:11:10 0 83
Andhra Pradesh
నడవలేని,మంచాలకు పరిమితం అయ్య, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఎవ్వరు కూడా పి జి ఆర్ ఎస్ కు తీసుకురాకండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల: నడవలేని,మంచాలకు పరిమితం అయ్య, అనారోగ్యంతో బాధపడుతున్న  వారిని ఎవ్వరు కూడా పి జి ఆర్...
By Gadiyapudi Narendra 2026-02-16 12:38:29 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com