TTD: మార్చి 3న చంద్రగ్రహణం... భక్తులకు టీటీడీ అలర్ట్.

0
126

మార్చి 1, 2 తేదీల్లో స్లాట్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నామన్న టీటీడీ

వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు సహా అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడి

మార్చి 3న రాత్రి 8:30 నుంచి తిరిగి దర్శనాలు ప్రారంభమవుతాయన్న టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నందున, రెండు రోజుల పాటు స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం, మార్చి 1, 2 తేదీల్లో తిరుపతిలోని కౌంటర్లలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయబడవు. 

 

టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఆగమశాస్త్ర నియమాల అనుసరించి, గ్రహణ సమయంలో ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ క్రమంలో మార్చి 3న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. 

 

గ్రహణం కారణంగా మార్చి 3న శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటివాటిని టీటీడీ రద్దు చేసింది. వీటితో పాటు వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

 

భక్తులను రాత్రి 8:30 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు. అయితే, మార్చి 4వ తేదీ దర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లను యథావిధిగా మార్చి 3న జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ మార్పులను గమనించి, తమ ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
డాక్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు!!
కర్నూలు:  ఎండీఎస్ఎల్, ముంబైలో 200 అప్రెంటిస్ లుముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్...
By Hari Krishna 2025-12-24 14:38:55 0 190
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: చిరుత దాడి దూడ మృతి, రైతు ఆవేదన
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని ముదిరెడ్డిపల్లిలో ఆదివారం చిరుత దాడిలో ఒక దూడ మృతి...
By Kothuru Murali 2026-03-02 04:19:31 0 99
Andhra Pradesh
నందిగామ ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నూతన రెవిన్యూ డివిజనల్ అధికారిగా జి అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు...
By Patan Khuddus 2026-05-06 11:40:29 0 195
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు...
By Kothuru Murali 2026-01-07 02:41:47 0 247
Telangana
మేలు జాతి దూడల ప్రదర్శన
చిలుకూరు మండల పరిధిలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రం నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల...
By Nookapangu Manikanta 2026-05-08 09:46:28 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com