TTD: మార్చి 3న చంద్రగ్రహణం... భక్తులకు టీటీడీ అలర్ట్.

0
180

మార్చి 1, 2 తేదీల్లో స్లాట్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నామన్న టీటీడీ

వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు సహా అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడి

మార్చి 3న రాత్రి 8:30 నుంచి తిరిగి దర్శనాలు ప్రారంభమవుతాయన్న టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నందున, రెండు రోజుల పాటు స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం, మార్చి 1, 2 తేదీల్లో తిరుపతిలోని కౌంటర్లలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయబడవు. 

 

టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఆగమశాస్త్ర నియమాల అనుసరించి, గ్రహణ సమయంలో ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ క్రమంలో మార్చి 3న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. 

 

గ్రహణం కారణంగా మార్చి 3న శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటివాటిని టీటీడీ రద్దు చేసింది. వీటితో పాటు వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

 

భక్తులను రాత్రి 8:30 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు. అయితే, మార్చి 4వ తేదీ దర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లను యథావిధిగా మార్చి 3న జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ మార్పులను గమనించి, తమ ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
దాడికి గురైన బాధితుడు తరుపున అండగా నిలబడ్డ బి సి నాయకులు... దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి...
By BABJI DADALA 2026-01-07 15:17:01 0 324
Telangana
పెద్దపల్లి : పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన జనం..!
పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో డీజిల్ పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు....
By Sunka Santhosh 2026-04-27 19:14:31 0 200
Andhra Pradesh
నెల్లూరు మహానాడు ఏర్పాట్లపై కీలక సమావేశానికి హాజరైన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పార్థసారధి గారు తిరుపతి ఎయిర్పోర్టులో గనస్పాగతం
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం కిసాన్ సేస్ వద్ద ఈనెల 27 28 29 తేదీల్లో...
By Benguluri Madhubabu 2026-05-13 06:22:26 0 216
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన రాజంపేట టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు పీలేరు నందు నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రిలీఫ్ ఫండ్...
By Benguluri Madhubabu 2026-01-23 13:17:37 0 266
Andhra Pradesh
ఆటో - టిప్పరు లారీ ఢీ.. ఒకరి మృతి, 12 మందికి గాయాలు...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర...
By BABJI DADALA 2026-02-04 13:49:10 0 480
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com